బ్యాంకులలో చెక్కు మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ త్వరలో కొత్త విధానం తీసుకు రానుంది. పాజిటివ్ పే పేరుతో దీనిని తీసుకు వస్తోంది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంతదాస్ ద్రవ్య విధాన కమిటీ (MPC) తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. ఈ సందర్భంగా పాజిటివ్ పే ద్వారా చెక్కులకు మరింత సెక్యూరిటీ ఫీచర్స్ జోడిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

చెక్కు భద్రత కోసం పాజిటివ్ పే.. ఎలా పని చేస్తుంది
ఈ పాజిటివ్ పే విధానంలో చెక్కు జారీ చేసే వ్యక్తి, సంబంధిత లబ్ధిదారుడికి చెక్కు ఇచ్చే ముందు,ఆ చెక్క్ ఫోటో తీసి దానిని బ్యాంకు మొబైల్ యాప్లో అప్ లోడ్ చేస్తారు. ఈ పద్ధతిని రూ.50,000కు పైన ఉండే అన్ని చెక్కులకు వర్తింప చేస్తారు. పరిమాణం పరంగా 20 శాతం, వ్యాల్యూపరంగా 80 శాతం ఈ పరిధిలోకి రానున్నాయి. చెక్కు పరిమాణంతో సంబంధం లేకుండా 2016 నుండి ఐసీఐసీఐ బ్యాంకు ఈ సదుపాయాన్ని తీసుకు వచ్చింది.

డిపాజిట్ కంటే ముందే బ్యాంకుకు వివరాలు
పాజిటివ్ పే వంటి విధానం ద్వారా వినియోగదారు ఇచ్చిన చెక్కును లబ్ధిదారు తన ఖాతాలోకి డిపాజిట్ చేయడానికి ముందే బ్యాంకుకు ఆ చెక్కుకు సంబంధించిన వివరాలు తెలుస్తాయి. చెక్కు ఎవరి పేరు మీద, ఎంత మొత్తానికి జారీ చేశారనే విషయాలు తెలుస్తాయి. డబ్బులు బదలీ చేయడానికి ముందే ఆ వివరాలను ముందస్తుగా తనిఖీ చేసేందుకు ఈ పద్ధతి మంచి వెసులుబాటు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యాభై వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి జారీ చేసే చెక్కులన్నీ పాజిటివ్ పే పరిధిలోకి వస్తాయి. చెక్కు ట్రంకేషన్ సిస్టం (CTS) 2010 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. చెక్కు మోసాలకు నిరోధకంగా ఉంటుంది.

CTS అంటే?
చెక్కులకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ను ఫిజికల్ మూమెంట్ ప్రాతిపదికన కాకుండా కేవలం ఎలక్ట్రానిక్ రూపంలో జరిగేలా వీలు కల్పించే విధానాన్ని చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTS) అంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చెక్కు లావాదేవీల్లో ఎటువంటి మోసాలు జరగకుండా చూడడం, అలాగే అన్లైన్లో ఎలక్ట్రానిక్ ఇమేజ్డ్ ప్రాతిపదికన చెక్కులు వెంటనే క్లియరెన్స్ ఈ విధానం ప్రధాన ఉద్దేశం.

సెప్టెంబర్ నుండి తీసుకు వస్తామని..
చెక్ చెల్లింపుల్లో మరింత భద్రతను పెంచడానికి, చెక్కు ఫ్రాడ్స్ జరగకుండా ఉండేందుకు పాజిటివ్ పేను తీసుకు వస్తోంది ఆర్బీఐ. చెక్కులకు సంబంధించి మరింత సెక్యూరిటీ కోసం సెప్టెంబర్ నాటికి కొత్త విధానం తీసుకు వస్తామని ఆర్బీఐ గతంలోనే చెప్పింది. రూ.50వేలు, అంతకుమించిన చెక్కులపై పాజిటివ్ పేను ప్రవేశ పెట్టడమంటే మరింత భద్రత కల్పించడమని బ్యాంకు బజార్ డాట్ కామ్ సీఈవో ఆదిల్ శెట్టి అన్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications