ముందే జాగ్రత్తపడండి! మార్చి-ఏప్రిల్‌లో వీటి ధరలు పెరగనున్నాయి, ఏ ధర ఎంత శాతం పెరగనుంది?

2020-21 బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నందున మార్చి నెల నుండి ధరలు పెంచేందుకు ఎయిర్ కండిషనర్, టెలివిజన్, రిఫ్రిజిరేటర్ తదితర కన్స్యూమర్ డ్యూరబుల్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. దీంతో వినియోగదారులపై భారం పడనుంది. మొబైల్ ఫోన్ ధరలు కూడా పెరగనున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలు పెంచాయి.

రూ.1,300 వరకు పెంచిన ఆపిల్

రూ.1,300 వరకు పెంచిన ఆపిల్

ఆపిల్ సంస్థ తన ఐపోన్ మోడల్స్ iPhone 11 Pro, 11 Pro Max, iPhone 8 వంటి వాటిపై ఇప్పటికే రూ.600 నుండి రూ.1,300 వరకు పెంచింది. కస్టమ్స్ డ్యూటీ పెరుగుతున్న నేపథ్యంలో ధరలు పెంచింది.

3 నుండి 6 శాతం పెరుగుదల

3 నుండి 6 శాతం పెరుగుదల

రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండిషన్స్ ధరలు ఈ నెల నుండి పెరగనున్నాయి. వీటి ధరలు 3 శాతం నుండి 6 శాతం వరకు పెరగనున్నాయి. అంటే ఎండాకాలం సందర్భంగా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు కొనే వారిపై మరింత భారం పడనుంది.

పెంపుకు కారణాలు..

పెంపుకు కారణాలు..

ఏసీలకు ఉపయోగించే మోటార్లు, కాంప్రెషర్ల పైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 2.5 శాతం పెంచారు. దీనికి తోడు కరోనా వైరస్ కారణంగా రవాణా ఖర్చులు పెరిగాయి. దీంతో ఆయా సంస్థలు తమ తమ ఉత్పత్తులపై ధరలను పెంచనున్నాయి.

వీటి ధరలు 10 శాతం పెంపు

వీటి ధరలు 10 శాతం పెంపు

వెన్న, జున్ను, ఫుడ్ గ్రైండర్, రూమ్ హీటర్స్, టీ, కాఫీ మేకర్స్, కిచెన్‌వేర్ తదితర వస్తువులపై ఈ బడ్జెట్‌లో కస్టమ్ సుంకాన్ని పెంచారు. బూట్లపై ఇంపోర్ట్ డ్యూటీని 20 శాతం వేశారు. ఈ నేపథ్యంలో వీటి ధరలు కూడా పెరగనున్నాయి. స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ ప్యూమా ధరలు 10 శాతం మేర పెరగనున్నాయి. ఇవి ఏప్రిల్ నుండి పెరుగుతాయి.

అప్పటి దాకా పెంపు లేదు

అప్పటి దాకా పెంపు లేదు

ఇప్పటికే దిగుమతి చేసుకున్న వస్తువులపై తాము అధిక కస్టమ్స్ డ్యూటీ చెల్లించలేదని, కాబట్టి ప్రస్తుతానికి పెంచమని, ఈ స్టాక్ అయిపోయాక పెంచుతామని ప్యూమా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ గంగూలీ అన్నారు.

పెరిగిన కూల్ డ్రింక్స్ ధర

పెరిగిన కూల్ డ్రింక్స్ ధర

గోద్రేజ్ కన్స్యూమర్ ఉత్పత్తులు ఇప్పటికే 5 శాతం ధరలు పెంచాయి. పెప్సికో వంటి శీతల పానియాల సంస్థ కొన్ని వస్తువుల ధరలను సవరించింది. ఉదాహరణకు ఈ ఫుడ్ అండ్ బీవరేజ్ సంస్థ ఉత్తర ప్రదేశ్‌లో 750ml సాఫ్ట్ డ్రింక్ ధరను రూ.38 నుండి రూ.40కి పెంచింది. 1.25 లీటర్ ప్యాక్ ధరను కర్ణాటకలో రూ.60 నుండి రూ.65కు పెంచింది.

వీటి ధరలు కూడా...

వీటి ధరలు కూడా...

FMCG మేజర్ పార్లే ఉత్పత్తులు, నెస్ట్లే ధరల పెరుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి. ముడిపదార్థాల ధరలు పెరుగుతున్నాయి. గత మూడు నెలలుగా గోధుమ, చక్కెర, ఎడిబుల్ ఆయిల్ సహా వివిధ వస్తువుల ధరలు 10 శాతం నుండి 20 శాతం మేర పెరిగాయి. జనవరిలో ద్రవ్యోల్భణం 7.59 శాతానికి పెరిగి 2014 మే తర్వాత గరిష్టానికి చేరుకుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+