నెలకు రూ.10,000 రిటైర్మెంట్ ఆదాయం పొందాలంటే ఇలా చేయండి

మీది పెళ్లైన జంటనా? రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారా? అవును అంటే కనుక, అటల్ పెన్షన్ యోజన(APY) పథకాన్ని ఎంచుకుంటే మంచి రిటర్న్స్‌తో పాటు భద్రత ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన కింద రెండు సపరేట్ అకౌంట్స్ ఓపెన్ చేసి, ఆ తర్వాత నెలకు రూ.10,000 ఆదాయం పొందవచ్చు. పన్ను కంటే దంపతులు అయితే తమ పెట్టుబడిపై ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అటల్ పెన్షన్ యోజనను 2015లో ప్రారంభించారు. తమ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి అసంఘటిత రంగంలోని వారికి ఊతమిచ్చేలా దీనిని ప్రారంభించారు. 18 నుండి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఎవరైనా అటల్ పెన్షన్ యోజన ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు.

అటల్ పెన్షన్ యోజనలో చేరితే

అటల్ పెన్షన్ యోజనలో చేరితే

మీకు బ్యాంకు లేదా పోస్టాఫీస్‌లో ఖాతా ఉంటే అటల్ పెన్షన్ యోజనలో చేరవచ్చు. పెట్టుబడిదారులకు అరవై ఏళ్ల తర్వాత నుండి పెన్షన్ రావడం ప్రారంభమవుతుంది.

ఈ పథకం కింద ఇన్వెస్ట్ చేసినవారు తమ పెట్టుబడి ప్రాతిపదికన నెలవారీ పెన్షన్‌ను రూ.1000, రూ.2000, రూ.3000, రూ.4000, రూ.5000 వరకు పొందవచ్చు.

అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టేందుకు ఆధార్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్ తప్పనిసరి.

పెట్టుబడిదారు ఈ పథకం కింద ఎంత త్వరగా పెట్టుబడి పెడితే అతడు లేదా ఆమె అంత ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో అటల్ పెన్షన్ యోజనలో చేరితే అరవై ఏళ్ల తర్వాత అతను లేదా ఆమె ప్రతి నెల రూ.5000 నెలవారీ పెన్షన్ పొందవచ్చు. ఇందు కోసం నెలకు రూ.210 డిపాజిట్ చేయాలి.

రూ.10వేలు రావాలంటే

రూ.10వేలు రావాలంటే

30 కంటే తక్కువ వయస్సు ఉన్న దంపతులు రెండు సపరేట్ అటల్ పెన్షన్ యోజన అకౌంట్స్ తెరిచి, అరవై ఏళ్ల తర్వాత నెలకు రూ.10,000 పొందవచ్చు. అయితే వీరు తమ తమ అకౌంట్లలో రూ.577 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి.

ఒకవేళ భార్యా, భర్తల వయస్సు 35 అయితే కను వారు నెలకు రూ.902 ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు గానీ అరవై ఏళ్ల తర్వాత నెలకు రూ.10,000 పెన్షన్ పొందుతారు.

సెక్షన్ 80సీ కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు ఉన్నాయి.

ఆస్తులు ఎంతంటే

ఆస్తులు ఎంతంటే

ఇదిలా ఉండగా, ఎన్పీఎస్ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల పెన్షన్ నిధులతో పాటు ప్రయివేటు రంగం ఉద్యోగుల పెన్షన్ నిధులు ఎక్కువగా ఉంటాయి. అలాగే, పౌరులు ఎవరైనా ఎన్పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎన్పీఎస్ పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ ఉద్యోగుల ఆస్తులు 2022 జనవరి 1వ తేదీ నాటికి రూ.3,52,217 కోట్లుగా ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తులు రూ.2,11,656 కోట్లుగా ఉన్నాయి. కార్పొరేట్ రంగం ఉద్యోగుల ఆస్తులు రూ.82,190 కోట్లుగా ఉన్నట్టు PFRDA విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పౌరుల విభాగంలోని ఆస్తులు రూ.28,657 కోట్లుగా ఉన్నాయి. ఈ రెండు పథకాలను PFRDA పర్యవేక్షిస్తుంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+