రూ.2 వేల వరకు UPI ఫ్రీ.. మరి రూ.3 వేల నుంచి రూ.1 లక్ష వరకు MDR ఎంత.. ఎవరు చెల్లించాలి.. పూర్తి లెక్క ఇదే..

భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో అత్యంత ప్రజాదరణ పొందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సరికొత్త ఛార్జీల విధానానికి శ్రీకారం చుట్టాయి. ఇప్పటివరకు రూపాయి కూడా రుసుము లేకుండా సాగిన యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే అంశంపై స్పష్టతనిస్తూ, నూతన నిబంధనలు, ఛార్జీల వివరాలను అధికారికంగా వెల్లడించారు.

ఈ నిర్ణయం ద్వారా సాధారణ వినియోగదారులు, చిన్న వ్యాపారులకు ఊరట లభించినప్పటికీ, పెద్ద మొత్తంలో డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపార వర్గాలపై కొంత మేర ప్రభావం పడనుంది. ప్రజలలో, వ్యాపారులలో ఎలాంటి గందరగోళం నెలకొనకుండా ఉండటానికి విభిన్న లావాదేవీల పరిమాణాల ఆధారంగా వర్తించే ఛార్జీల పట్టికను ప్రభుత్వం పారదర్శకంగా ప్రకటించింది.

UPI New Rules 2026 UPI Charges UPI MDR UPI Payment Charges UPI MDR Calculation 0 4 MDR UPI Fee Above 2000 3000 UPI Charge 1 Lakh UPI Charge NPCI UPI Rules UPI Charges From October 15 Digital Payments India UPI New Rules 2026 UPI Charges UPI MDR UPI Payment Charges UPI Rules UPI MDR Calculation 2000 UPI 3000 UPI 1 UPI 0 4 MDR UPI Fee NPCI UPI Rules 15 UPI Digital Payments

నూతన నిబంధనల ప్రకారం.. రూ. 2,000 వరకు జరిగే రోజువారీ చిన్న చిన్న లావాదేవీలపై ఎలాంటి ఎండీఆర్ ఛార్జీలు వర్తించవు. అంటే, సాధారణ పౌరులు తమ రోజువారీ నిత్యావసరాలు, కిరాణా సరుకులు, టీ కొట్టు చెల్లింపుల వంటి సుమారు రూ. 2,000 లోపు వ్యాపారులకు చేసే లావాదేవీలకు ఎండీఆర్ సున్నాగా ఉంటుంది.

అయితే, రూ. 2,000 పరిమితి దాటిన పెద్ద మొత్తాల లావాదేవీలపై వ్యాపారులు (మర్చంట్లు) తమ అక్వైరింగ్ బ్యాంకులకు 0.4 శాతం ప్రామాణిక రేటుతో ఎండీఆర్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కస్టమర్ రూ. 3,000 చెల్లింపు చేస్తే.. 0.4% ప్రకారం వ్యాపారి రూ. 12 రుసుము చెల్లించాలి. అదేవిధంగా, రూ. 50,000 చెల్లింపు జరిగినప్పుడు 0.4% చొప్పున వ్యాపారిపై రూ.200 రుసుము పడుతుంది. లావాదేవీ విలువ పెరిగే కొద్దీ ఈ రుసుము కూడా దామాషా ప్రకారం పెరుగుతుంది.

Also Read

అయితే, అతిపెద్ద లావాదేవీల విషయంలో వ్యాపారులపై అపరిమిత భారం పడకుండా ప్రభుత్వం ఒక ప్రత్యేక గరిష్ట పరిమితిని (Cap) నిర్దేశించింది. నూతన నిబంధనల ప్రకారం, రూ. 75,000, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన ప్రతి లావాదేవీపై విధించే గరిష్ట ఎండీఆర్ పరిమితిని రూ. 300 గా నిర్ణయించారు. ఉదాహరణకు, ఒక కస్టమర్ దుకాణదారుడికి రూ. 1,00,000 చెల్లించినట్లయితే, సాధారణ 0.4% లెక్కన రూ. 400 కాకుండా, గరిష్ట పరిమితి నిబంధన వల్ల వ్యాపారి కేవలం రూ.300 మాత్రమే ఎండీఆర్ రుసుముగా చెల్లిస్తాడు. దీనివల్ల పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిపే వర్తకులకు వసూలు చేసే రుసుములకు ఒక అగ్రపరిమితి ఏర్పడింది.

ఈ కొత్త ఛార్జీల విధానం డిజిటల్ చెల్లింపుల రంగాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి, సైబర్ భద్రతను పటిష్టం చేయడానికి అత్యవసరమని ప్రభుత్వం వాదిస్తోంది. రోజురోజుకూ వేగంగా పెరుగుతున్న లావాదేవీల రద్దీని తట్టుకునేలా మౌలిక సదుపాయాల ఆధునీకరణ, మోసాల నివారణ, సాంకేతిక అభివృద్ధికి భారీగా నిధులు అవసరమని, కేవలం సబ్సిడీలపై మాత్రమే ఈ వ్యవస్థను నడపడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు. స్థిరమైన ఆదాయ నమూనా ఉన్నప్పుడే కొత్త ప్రైవేట్ కంపెనీలు ఈ రంగంలోకి వచ్చి మెరుగైన సేవలు అందిస్తాయని ప్రభుత్వం అభిప్రాయపడింది.

మరోవైపు ఈ ఎండీఆర్ ఛార్జీల విధించడంపై పరిశ్రమ వర్గాలలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. భారత్‌పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ వంటి ప్రముఖులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. ఉచిత యూపీఐ విధానమే అసలైన విజయ రహస్యమని.. లావాదేవీల విలువలో 66% వాటా కలిగిన పెద్ద చెల్లింపులపై ఛార్జీలు విధిస్తే వ్యాపారులు తిరిగి నగదు (Cash) లావాదేవీల వైపు మళ్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది బ్యాంకింగ్ రంగానికి ఏటీఎం నిర్వహణ, నగదు పంపిణీ ఖర్చులను మళ్లీ పెంచుతుందని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+