దేశవ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా నగదు లావాదేవీలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ లావాదేవీలు జరగడానికేకాకుండా పెరగడానికి నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్), ఐఎంపీఎస్ (ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్), ఆర్టీజీఎస్ (రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్) వ్యవస్థలు దోహదపడుతున్నాయి. వీటిని మరింత ఎక్కువ మంది వినియోగించుకునే విధంగా ఆర్బీఐ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వీటి ద్వారా లావాదేవీలను నిర్వహించే కాలంపై ఉన్న పరిమితులను సడలించారు.
ఈ మూడు విధానాల ద్వారా నగదు బదిలీ జరుగుతోంది. వీటిలో దేని ప్రత్యేకత దానిదే. ఇంతకు ముందు ఐఎంపీఎస్ ద్వారా నగదు బదిలీ రియల్ టైం లో జరిగేవి. నెఫ్ట్ లావాదేవీల నిర్వహణపై కొన్ని పరిమితులు ఉండేవి. ఐఎం పీఎస్ మాదిరిగా నెఫ్ట్ కూడా ఇప్పుడు 24 గంటలు అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు కూడా కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా సేవలను అందిస్తున్నాయి.

ఎంత బదిలీ చేయవచ్చంటే....
* చిన్న మొత్తంలో ఆన్ లైన్ ద్వారా నగదు బదిలీ చేయడానికి ఐఎంపీఎస్ విధానం ఉపయోగపడుతుంది. దీని ద్వారా గరిష్టంగా రెండు లక్షల రూపాయలు బదిలీ చేయవచ్చు. ఎంత తక్కువ మొత్తాన్నయినా బదిలీ చేయవచ్చు.
* నెఫ్ట్ ద్వారా అయితే గరిష్ట మొత్తం బదిలీ పై ఎలాంటి పరిమితి లేదు. దీని ద్వారా పెద్ద మొత్తంలో నగదును ఎప్పుడయినా బదిలీ చేయడానికి అవకాశం ఉంటుంది.
* యూపీఐ లేదా ఐఎంపీఎస్ ల కన్నా ఎక్కువ మొత్తంలో లావాదేవీలను జరపడానికి అవకాశం ఉంటుంది.

చార్జీలు
* ఈ జనవరి నుంచి నెఫ్ట్, ఆర్టీ జీఎస్ లావాదేవీలపై ప్రాసెసింగ్ చార్జీలను ఎత్తివేస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ప్రకటించింది. డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం కల్పించే చర్యల్లో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
* నెఫ్ట్ ద్వారా మరొకరికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో నగదు బదిలీ చేయాలంటే ముందు వారి ఖాతా నెంబర్ను జత చేసుకోవాల్సిఉంటుంది. ఇందుకోసం వారికి సంభందించిన బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు ఐఎఫ్ ఎస్ సి కోడ్ నెంబర్ అవసరం ఉంటుంది. అయితే పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేయాలంటే ఈ విధానం సరియైనది.

ఐఎంపీఎస్ పై చార్జీలు
* ఐఎంపీఎస్ పై చార్జీలు అమలవుతున్నాయి. ఈ చార్జీలు నగదు బదిలీ చేసే మొత్తం పై ఆధారపడి ఉంటాయి. బదిలీ చేసే సొమ్మును బట్టి రూపాయి నుంచి పాతిక రూపాయలవరకు బ్యాంకులు చార్జీలను వసూలు చేస్తాయి. అయితే ఈ చార్జీలను ఎత్తివేస్తే డిజిటల్ లావాదేవీలు మరింతగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
* ఐఎంపీఎస్ ద్వారా మొబైల్ ఫోన్ వినియోగదారులు ప్రతిసారీ బ్యాంక్ వివరాలను ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. మొబైల్ మనీ ఐడెంటి ఫయర్ ద్వారా నగదు బదిలీ చేయవచ్చు. దీన్నీ బ్యాంకు నుంచి పొందవచ్చు. అప్పుడు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ను ఉపయోగించి నగదు బదిలీ చేయవచ్చు. ఐ ఎం పీ ఎస్ లో ఖాతా నెంబర్ తో పాటు ఐఎఫ్సి కోడ్ ను ఎంటర్ చేసి వెంటనే నగదు బదిలీ చేయవచ్చు.
* ఇక ఆర్టీజీఎస్ ను భారీ మొత్తంలో ఇంటర్ బ్యాంక్ నగదు బదిలీ కోసం వినియోగిస్తుంటారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications