దేశంలో బంగారం ధరలు రికార్డ్ దిశగా వెళ్తున్నాయి. ఎంసీఎక్స్లో శుక్రవారం 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.600 పెరిగి రూ.48,000 పలికింది. సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 1.5 శాతం పెరిగిరూ.48,598 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ శుక్రవారం 1 శాతం పెరిగి ఔన్స్ ధర 1,750 డాలర్లు పలికింది. కరోనా వంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే పసిడి ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఈ వారం ఎలా ఉండవచ్చు
బంగారం ఆగస్ట్ కాంట్రాక్ట్ రూ.46,985 కిందకు రాకుంటే కొనుగోళ్లకు మొగ్గు చూపవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. స్వల్ప కాలానికి రూ.48,100, మధ్యకాలానికి రూ.48,890 లక్ష్యంతో లాంగ్ పొజిషన్లు కొనసాగించవచ్చునని చెబుతున్నారు. కరోనా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో పసిడి సానుకూలంగా కనిపిస్తోంది. అమెరికా ఫెడ్ వ్యాఖ్యల ప్రభావం ఉంటుంది. ఆర్థిక గణాంకాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని, ఈక్విటీ మార్కెట్ కోసం ఇన్వెస్టర్లు వేచి చూడటం బంగారానికి కలిసి రావొచ్చునని అంటున్నారు. వెండి కూడా కిలో రూ.47,878కి కిందకి రాకుంటే లాభాల్లోకి వెళ్తుందంటున్నారు.

23 శాతం పెరిగిన ధరలు
ఈ ఏడాదిలో (2020) అంటే గత ఆరు నెలల కాలంలోనే భారత్లో బంగారం ధరలు 23 శాతం పెరిగాయి. అంతకుముందు ఏడాది 25 శాతం పెరిగింది. మన దేశంలో బంగార ధరలను అంతర్జాతీయ మార్కెట్, డాలర్తో రూపాయి మారకం విలువ వంటివి ప్రభావితం చేస్తాయి. శుక్రవారం డాలర్ మారకంతో రూపాయి 76.19 వద్ద క్లోజ్ అయింది.

అంతర్జాతీయ పరిస్థితులు
మందగమనం, కరోనా నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు వంటి వివిధ కారణాలతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 15 శాతం పెరిగాయి. సెంట్రల్ బ్యాంకు ఉద్ధీపనలు, ఆర్థిక ప్యాకేజీ వంటివి బంగారం డిమాండ్కు కారణమయ్యాయి. ఇటీవల కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తుందనే ఆందోళనలు, అమెరికా-చైనా ఉద్రిక్తతలు కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూశారన్నారు.

బంగారం ధర భారీగా పెరగనుంది..
బంగారం ధరలు ఈ వారం కూడా పెరుగవచ్చునని గ్లోబల్ ఫైనాన్షియల్ పవర్ హౌస్ గోల్డ్మన్ సాక్స్ అభిప్రాయపడింది. కరెన్సీ క్షీణత భయాలు, కరోనా అనిశ్చితి వల్ల ర్యాలీ కొనసాగవచ్చునని తెలిపింది. గోల్డ్మన్ సాక్స్ తన 3 నెలల, 6 నెలల, 12 నెలల బంగారం ధరల అంచనాలను వరుసగా 1,600 డాలర్ల నుండి 1,800 డాలర్లకు, 1,650 డాలర్ల నుండి 1,900 డాలర్లకు, 1,800 డాలర్ల నుండి $2,000 డాలర్లకు పెంచింది. అంటే మన దేశంలోను ఆ మేరకు బంగారం ధరలు భారీగా పెరగవచ్చు.

డిస్కౌంట్ తగ్గింది..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతుండటంతో భారత దేశంలో రిటైలర్స్ డిస్కౌంట్ను అంతకుముందు వారం ఔన్స్కు 20 డాలర్ల నుండి 13 డాలర్లకు తగ్గిస్తున్నారట. అంతర్జాతీయంగా బంగారం ధరల కారణంగా గోల్డ్ ఈటీఎఫ్లలోకి పెట్టుబడులు పెరిగాయి. అంతర్జాతీయ బిగ్గెస్ట్ గోల్డ్ ఈటీఎఫ్ సంస్థ SPDR ETFలో గురువారం నాటికి 1,136.219 టన్నులకు పెరిగింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ETFs.. కొనుగోలుపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

Iran Israel war: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం! భారత ఆర్థిక వ్యవస్థకు, స్టాక్ మార్కెట్లకు ముప్పు తప్పదా?

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?



Click it and Unblock the Notifications