బంగారం ధరలు ఆ స్థాయికి తగ్గొచ్చు.. మళ్లీ పెరుగుతాయ్
బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ వారం చివరి సెషన్లో స్వల్పంగా పెరిగినప్పటికీ, మొత్తంగా క్షీణించాయి. అంతర్జాతీయంగా బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీకి డిమాండ్ పెరగడం, అమెరికా బాండ్స్ పైన అధిక ప్రతిఫలాలు వస్తుండటం, స్టాక్ మార్కెట్ రాణించడం వల్ల పసిడి, వెండి ధరలపై ప్రభావం పడింది. బిట్ కాయిన్, స్టాక్ మార్కెట్కు పెట్టుబడులు తరలుతున్నాయి. దీంతో బంగారంపై ఒత్తిడి తగ్గింది. అందుకే పసిడి ధరలు పది నెలల కనిష్టానికి చేరుకున్నాయి. ఈ వారం పసిడి ఫ్యూచర్ మార్కెట్లో రూ.46,000 దిగువన ముగిసింది.
HDFC గుడ్న్యూస్, హోంలోన్ వడ్డీ రేటు తగ్గింపు: SBI, కొటక్ బ్యాంకులోను...
తగ్గి.. మళ్లీ పెరగొచ్చు
దేశీయంగా బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ.46,000 దిగువకు, వెండి కిలో రూ.68,000 దిగువకు చేరుకుంది. మున్ముందు పసిడి రూ.44,000 దిగువకు, వెండి రూ.65,000 స్థాయికి చేరవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాదిస్థాయికి కాకపోయినా ఈ ఏడాదిలో తిరిగి ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. కరోనాకు ముందు బంగారంపై పెట్టుబడులు పెట్టిన వారికి 25 శాతం నుండి 40 శాతం వరకు లాభాలు వచ్చాయి. దీంతో కొద్ది రోజులుగా బంగారంపై పెట్టుబడులు పెరిగాయి. అయితే ఇటీవల భారీగా పడిపోవడంతో తిరిగి పెట్టుబడులు తగ్గాయి.
రిటైల్ మార్కెట్లో ఇలా
ఈ ఏడాదిలో పసిడి ఇప్పటికే 5 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) స్వచ్ఛమైన బంగారం 1,700 డాలర్ల వద్ద ఉంది. దేశీయంగా రూ.46,000 సమీపంలో ఉంది. కమొడిటీ ట్రేడింగ్ జరిగే ఎంసీఎక్స్లో పది గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.44,445 వద్ద ఉంది. రిటైల్ మార్కెట్లో ఈ ధరకు 3 శాతం జీఎస్టీ, 0.0075 శాతం టీసీఎస్ కలిపితే అది మేలిమి బంగారం అవుతుంది.
అంతర్జాతీయ మార్కెట్లో...
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.99 పెరిగి రూ.44,640 వద్ద, జూన్ ఫ్యూచర్స్ రూ.77 పెరిగి రూ.44,813 వద్ద క్లోజ్ అయింది. వెండి రూ.204 తగ్గి రూ.65,717 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.66,800 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ గోల్డ్ ఫ్యూచర్స్ 2.70 (-0.16%) తగ్గి రూ.1698 వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.181
(-0.71%) తగ్గి రూ.25,280 వద్ద క్లోజ్ అింది.