భారతీయులు మ్యూచువల్ ఫండ్స్, షేర్ల కంటే ఫిక్స్డ్ డిపాజిట్లవైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ తాజా సర్వేలో వెల్లడయింది. బ్యాంక్ డిపాజిట్లలో తమ డబ్బును
భారతీయులు మ్యూచువల్ ఫండ్స్, షేర్ల కంటే ఫిక్స్డ్ డిపాజిట్లవైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ తాజా సర్వేలో వెల్లడయింది. బ్యాంక్ డిపాజిట్లలో తమ డబ్బును ఉంచేందుకు 95 శాతానికి పైగా భారతీయులు మొగ్గుచూపుతుండగా, 10 శాతం కంటే తక్కువ మందే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబులు పెడుతున్నారని సెబీ ఇన్వెస్టర్ సర్వే 2015 పేర్కొంది. ఈ సర్వే కోసం 2 లక్షలకు పైగా కుటుంబాలను ఎంపిక చేశారు. చివరకు 50,453 కుటుంబాలపై తుది సర్వే నిర్వహించారు. 2015లో ప్రారంభమైన ఈ సర్వే 2016లో ముగిసింది. నీల్సన్ ఇండియా సంస్థ నిర్వహించిన ఈ సర్వే వివరాలను బుధవారం వెల్లడించారు.సర్వే ముఖ్యాంశాలు మీ కోసం...

పెట్టుబడుల్లో దేని స్థానం ఎక్కడ?
ఎఫ్డీల తర్వాత పెట్టుబడులకు జీవిత బీమా పాలసీలకు రెండో ప్రాధాన్యతను భారతీయులు ఇస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో బంగారం, వెండి వంటి విలువైన లోహాలు, పోస్టా ఆఫీస్ సేవింగ్స్ పథకాలు, రియల్ ఎస్టేట్లు ఉన్నాయి. పెట్టుబడి ప్రాధాన్యాలకు సంబంధించి ఈ ఐదు సాధనాల తర్వాతే ఆరోస్థానంలో మ్యూచువల్ ఫండ్స్(9.7%), ఏడో స్థానంలో స్టాక్ మార్కెట్(8.1%) పెట్టుబడులు ఉన్నాయి.

సిప్ మార్గంలో పెట్టుబడులు పెడుతున్నవారు 60% మంది
* 3.37 కోట్ల ఇన్వెస్టర్ కుటుంబాలు భారత్లో ఉన్నాయి. వీటిల్లో 2.37 కోట్లు పట్టణ ప్రాంతాల్లో, 1 కోటి మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు.
మొత్తం ఇన్వెస్టర్ కుటుంబాల్లో 66 శాతం కుటుంబాలు(2.2 కోట్ల కుటుంబాలు) ఇన్వెస్ట్మెంట్స్కు, మ్యూచువల్ ఫండ్స్కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిదారుల్లో 60% మంది సిప్ మార్గాన్నే ఎంచుకుంటున్నారు.

సర్వేలో ఆసక్తికరమైన అంశాలు
* 1.9 కోట్ల కుటుంబాలు ఈక్విటీల్లో, 77 లక్షల కుటుంబాలు బాండ్లలో పెట్టుబడులు పెట్టాయి.
* 30 లక్షల కుటుంబాలు ఈక్విటీ, కరెన్సీ డెరివేటివ్స్లో, 21 లక్షల కుటుంబాలు కమోడిటీ ఫ్యూచర్స్లో ఇన్వెస్ట్ చేశాయి.
* వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్న వారిలో 75% మంది గత 5 సంవత్సరాల్లోనే ఈక్విటీల్లోకి మొదటిసారి ప్రవేశించారు.

గ్రామీణులకు షేర్లపై అవగాహన తక్కువ
* ఇక గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేసిన వారిల్లో ఒక్క శాతం మంది కూడా షేర్లలో మదుపు చేయడం లేదు. ఫండ్స్, షేర్ల గురించి అవగాహన ఉన్నవారి శాతం నిరాశపరిచే విధంగా 1.4% ఉంది.
* సర్వేలో పాల్గొన్న గ్రామీణ జనాభాలో 95 శాతం మందికి బ్యాంక్ ఖాతాలున్నాయి. 47 శాతం మంది జీవిత బీమా పాలసీలు తీసుకున్నారు. 29% మందికి తపాలా డిపాజిట్లు ఉన్నాయి. 11 శాతం మంది విలువైన లోహాల్లో(బంగారం,వెండి) పెట్టుబడులు పెట్టారు.

లావాదేవీలకు మొబైల్యే ఎక్కువ
స్టాక్ లావాదేవీలను ఇంటర్నెట్లో సొంతంగా నిర్వహిస్తున్న వారు 22% మందే. ఎక్కువ శాతం మంది మధ్యవర్తులపై ఆధారపడుతున్నారు. తమ బ్రోకరేజీ సంస్థలకు ఫోన్ చేసి, ఆర్డర్లు పెట్టేవారి శాతం 78గా ఉంది. మార్కెట్ లావాదేవీలకు అవసరమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు సామాజిక మాధ్యమాలను వాడుతున్న వారు 40% మంది. కొత్త ఖాతాదారులను సంపాదించేందుకు ముఖాముఖి సంప్రదించే మధ్యవర్తిత్వ సంస్థలు 52 శాతంగా ఉండగా, ప్రసార మాధ్యమాల ద్వారా చేరుకుంటున్నవారు 51%, ఫోన్కాల్స్ ద్వారా 50% మంది ఉన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications