ఎల్ఐసీ సంస్థను స్థాపించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సరికొత్త మనీ బ్యాక్ పాలసీని విడుదల చేయాలని నిర్ణయించారు. వజ్రోత్సవాల సందర్భంగా 2017 ఆగస్టు 31 వరకూ అందుబాటులో ఉండేలా 'బీమా డైమండ్ పాలసీని విడుదల చేశారు. పరిమిత కాల ప్రీమియం చెల్లింపులతో 16, 20 లేదా 24 సంవత్సరాల పాటు అమలయ్యే పాలసీలను ఆఫర్ చేస్తోంది. మనం ఎంచుకునే కాలపరిమితిని బట్టి ప్రీమియాన్ని 10, 12, 15 సంవత్సరాల పాటు చెల్లించాల్సి వుంటుంది. పాలసీకి అదనంగా యాక్సిడెంటల్ డెత్, వికలాంగత్వ ప్రయోజనాల రైడర్లను ఎంచుకోవచ్చని ఎల్ఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. పాలసీ హామీగా కొంతకాలం తర్వాత రుణాలు సైతం లభిస్తాయి.
మనీ బ్యాక్ ప్లాన్ అంటే ఏమిటి?
ఎండోమెంట్ ప్లాన్లలా కాకుండా, మనీ బ్యాక్ పాలసీలలో, పాలసీ కాలంలో పాలసీదారు "క్రమానుగత చెల్లింపుల"ను మరియు దాని టర్మ్ కొనసాగినప్పుడు ఏకమొత్తం నగదు అందుకుంటాడు. పాలసీ టర్మ్ కాలంలో మరణం సంభవించినప్పుడు, ఆ రోజు వరకు చెల్లించిన మొత్తాలను తగ్గించకుండానే, లబ్దిదారు హామీ ఇవ్వబడిన పూర్తి మొత్తాన్ని పొందగలడు, తదుపరి ప్రీమియంలు చెల్లించనవసరం లేదు. ఈ రకం పాలసీలు చాలా ప్రజాదరణ పొందుతాయి, ఎందుకంటే ఇవి పాలసీదారు అవసరాలకు అనుగుణంగా నిర్దిష్ట కాలాలకు గాను పెద్ద మొత్తాలను అందించగలుగుతాయి.