మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న ఘటనల పైన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. అంబటి రాంబాబు... జోగి రమేశ్ నివాసాల పైన జరిగిన దాడులు.. నేపథ్యం పైన చర్చించారు. ఇప్పటికే ఈ దాడుల పైన కేంద్ర హోం శాఖ ను ట్యాగ్ చేస్తూ జగన్ ట్వీట్ చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పైన విమర్శలు చేసారు. కాగా,ఇప్పుడు జగన్ మరో నిర్ణయంతో సిద్దమయ్యారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ నేతలతో కీలక చర్చలు చేసారు. కొద్ది రోజులుగా చోటు చేసుకొంటు న్న పరిణామాల పైన చర్చించారు. అంబటి రాంబాబు, జోగి రమేశ్ నివాసాల పైన టీడీపీ కేడర్ దాడులను ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీ నేతలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించారు. జోగి రమేశ్ తోనూ మాట్లాడారు. ఇదే సమయంలో పార్టీ నేతలతో కీలక భేటీ ఏర్పాటు చేసారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ పరంగా ఎలాంటి కార్యాచరణ ఖరారు చేయాల నే అంశం పైన చర్చించనున్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో కేంద్రా నికి ఎంపీలతో ఫిర్యాదు చేయించాలని డిసైడ్ అయ్యారు. దాడులకు నిరసనగా పార్టీ పరంగా నిరస న చేపట్టే ఆలోచనతో ఉన్నారు. దీని పైన పార్టీ నేతల సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ముఖ్య నేతలతో సమావేశానికి జగన్ నిర్ణయించారు.
నాగబాబు పైన పవన్ సీరియస్, ఆ మీటింగ్స్ కు వెళ్లద్దు - ఆ ఇద్దరికీ ఘాటు హెచ్చరిక..!!

దాడుల పై నిరసన
కాగా, అంబటి రాంబాబు... జోగి రమేశ్ నివాసాలకు వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యారు. బుధవారం గుంటూరు కు వెళ్లనున్న జగన్ అంబటి రాంబాబు ఇంటిని పరిశీలిస్తారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఇప్పటికే వారికి అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. ఇక, అంబటి ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. ఇక.. మరో నేత జోగి రమేశ్ ఇంటికి జగన్ వెళ్లాలని నిర్ణయించారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం లోని జోగి రమేశ్ ఇంటికి వెళ్లి జోగి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. వరుసగా వైసీపీ నేతల ఇళ్ల పైన జరిగిన దాడుల పై జగన్ కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి ఆధారాలను జత చేస్తూ... కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక.. పార్టీ ముఖ్య నేతలతో భేటీ తరువాత ఈ దాడుల విషయంలో జగన్ కార్యాచరణ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
Credit: Oneindia
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!



Click it and Unblock the Notifications