ఏపీ ప్రభుత్వం జిల్లాలు..మండలాలు పునర్విభజన పై తుది నిర్ణయం తీసుకుంది. తొలుత 29 జిల్లాలుగా ప్రతిపాదించినా.. ఇప్పుడు ఆ సంఖ్య 28కి పరిమితం చేసింది. కాగా, మదనపల్లి జిల్లా స్థానంలో అన్నమయ్య ను జిల్లాగా ఖరారు చేసినట్లు సమాచారం. భౌగోళికంగా మాత్రం కొత్త మార్పులు రానున్నాయి. అదే విధంగా మండలాల పైన నిర్ణయం తీసుకుంది. ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీలో కొత్త జిల్లాలకు అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు.
ఏపీ మంత్రివర్గం ఈ రోజు భేటీ కానుంది. కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. ప్రధానంగా కొత్త జిల్లాల పైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అన్నమయ్య జిల్లా పేరును కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుతమున్న జిల్లా భౌగోళిక స్వరూపం దాదాపుగా మారనుంది. ప్రస్తుతం రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా ఇక మదనపల్లె కేంద్రంగా ఉంటుంది. ఇదివరకే ప్రకటించిన మదనపల్లె కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాను అన్నమయ్య జిల్లాగా వ్యవహరిస్తారు. రాయచోటి కూడా ఇదే జిల్లాలో ఉంటుంది. దీంతో రాజంపేట జిల్లా కేంద్రంగా ఉండాలన్న కొందరి డిమాండ్లకు, రాయచోటినే కొనసాగించాలన్న ఆందోళనలకు తావివ్వకుండా మదనపల్లె హెడ్క్వార్టర్స్గా అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తారు. కొత్తగా ప్రకటించినట్టు మదనపల్లె జిల్లా పేరు మాత్రం ఉండదని సమాచారం.

ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేటను కడప జిల్లాలో, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మిగిలిన రాయచోటి అన్నమయ్య జిల్లాలో కొనసాగనుంది. రెవెన్యూ శాఖ ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి మంత్రివర్గ ఆమోదం కోసం సోమవారం ఫైలు పంపించనుంది. ఆ తర్వాత జిల్లాల ఏర్పాటుపై ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్లు విడుదలవుతాయి. ఈ విషయంలో దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లే అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒకవేళ మంత్రివర్గ భేటీలో ఏదైనా అనూహ్య చర్చ జరిగి ముఖ్యమంత్రి మార్పులు సూచిస్తే ఆ దిశగా సవరణలు ఉంటాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో అన్నమయ్య జిల్లా పేరును కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాజంపేటను కడప జిల్లాలో, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో విలీనం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం గూడూరు డి విజన్ తిరుపతి జిల్లాలో ఉంది. ఈ డివిజన్లోని వాకాడు, చిట్టమూరు మండలాలను తిరుపతి జిల్లాలోనే కొనసాగించాలని నిర్ణయించారు.
ఎలమంచిలి వద్ద ప్రమాదం: విశాఖ నుంచి ప్రధాన రైళ్ల రాకపోకల పై రైల్వే కీలక నిర్ణయం..!!
గూడూరు డివిజన్లోని గూడూరు, కోట, చిల్లకూరు మండలాల ను తిరుపతి జిల్లా నుంచి తిరిగి నెల్లూరు జిల్లాలోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక తిరుపతి జిల్లాలో ఉన్న కలు వాయు, రాపూరు, సైదాపురం మండలాలను తిరిగి నెల్లూరులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నాయి. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 29కు చేరింది. అయితే మారిన పరిణామాల నేపథ్యంలో మదనపల్లె పేరిట ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయడం లేదు. అన్నమయ్య పేరిట ఉన్న జిల్లాకే మదనపల్లె హెడ్క్వార్టర్స్గా ఉండనుంది. ప్రతిపాదిత మదనపల్లె జిల్లా ప్రాంతం ఇందులోనే ఉండనుంది. దీంతో జిల్లాల సంఖ్య 28కు పరిమితమైంది. పోలవరం జిల్లా కూర్పులో ఎలాంటి మార్పులేదు. కొత్తగా ఏర్పాటు కానున్న మార్కాపురం జిల్లాలో పొదిలి ఉంది. దాన్ని అక్కడే కొనసాగించాలని నిర్ణయించారు. కురిచేడు, దొనకొండ మండలాలను ప్రకాశంలోనే కొనసాగించనున్నారు.
Credit: Oneindia
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications