ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్(JANASENA MLA ARAVA SREEDHAR) వ్యవహారం పెను సంచలనం సృష్టిస్తోంది. ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగిని చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల నేపథ్యంలో జనసేన అధిష్ఠానం కఠిన నిర్ణయం తీసుకుంది. పార్టీ విలువలకు కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో, ఈ వ్యవహారంపై నిజానిజాలను నిగ్గుతేల్చడానికి పార్టీ రంగంలోకి దిగింది.
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. శ్రీధర్ ఏడాదిన్నరగా తనను బెదిరిస్తూ, అఘాయిత్యాలకు పాల్పడ్డారని ఓ మహిళా ఉద్యోగి ఆరోపిస్తున్నారు. ఈ ఏడాదిన్నరలో తనను ఐదుసార్లు గర్భవతిని చేశారని.. అబార్షన్ కూడా చేయించారని బయటపెట్టింది. ఈ స్టోరీలో అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ మహిళా ఉద్యోగికి ఇదివరకే పెళ్లయింది. మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఉద్యోగ రీత్యా భర్త హైదరాబాద్లో ఉంటున్నాడు. అయినా కానీ ఈ ఎమ్మెల్యే రాసలీలలు కొనసాగించడం హాట్ టాపిక్ గా మారింది.

అంతే కాకుండా తనను పెళ్లి చేసుకుంటానని బలవంతం చేయడమే కాకుండా.. అందుకు ఒప్పుకోకపోవడంతో తన భర్తకు ఫోన్ చేసి బెదిరించాడని బాధితురాలు వాపోయింది. ఐటీ ఉద్యోగం చేస్తున్న తన భర్తకు విడాకులు ఇవ్వాలని హుకుం జారీ చేశారని దాంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయని చెబుతుంది. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని చెప్పింది చేయాల్సిందేనని పట్టుబట్టాడని.. లేదంటే తన మూడేళ్ల బిడ్డ ప్రాణం తీస్తానని హెచ్చరించారని కన్నీటి పర్యంతం అయ్యింది. ఇలా ఏడాదిన్నర కాలంగా సదరు జనసేన ఎమ్మెల్యే ఆగడాలు బరాయిస్తూ రాగా.. ఇప్పుడు తట్టుకోలేక వీడియోలు, వాట్సాప్ చాట్లతో సహా బయట పెట్టడం కలకలం రేపుతోంది.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండు
ఈ పరిణామాలపై స్పందించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యవహారాన్ని తేల్చడానికి పార్టీ ముగ్గురు సభ్యులతో కూడిన ఒక అంతర్గత విచారణ కమిటీని నియమించింది. టి. శివశంకర్, తంబళ్ళపల్లి రమాదేవి, టీసీ వరుణ్ తో ఏర్పాటు చేసిన కమిటీ ముందుకు.. అరవ శ్రీధర్ 7 రోజుల్లోగా హాజరై తన వివరణను సమర్పించాల్సి ఉంటుంది. విచారణ నివేదిక వచ్చే వరకు, తుది నిర్ణయం వెలువడే వరకు అరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ స్పష్టంగా ఆదేశించింది.
మరోవైపు, ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ కూడా బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించింది. అయితే, ఎమ్మెల్యే తల్లి ప్రమీల ఈ ఆరోపణలను ఖండించారు. తన కుమారుడిని అభాసుపాలు చేసేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని, ఆ మహిళే తన కుమారుడిని బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆమె ప్రత్యారోపణలు చేశారు.
Credit: Oneindia
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications