Yes Bank crisis: మార్చి 11 వరకు ఈడీ కస్టడీకి రానా కపూర్

యస్ బ్యాంకు వ్యవస్థాపకులు రాణా కపూర్‌ను కోర్టు ఆదివారం ఈడీ కస్టడీకి అప్పగించింది. మార్చి 11వ తేదీ వరకు ఆయనను ముంబై ప్రత్యేక కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించింది. యస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో రాణా కపూర్‌ను ఈడీ సుదీర్ఘ సమయం విచారించింది. అనంతరం ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టింది.

ఈడీ అధికారులు శనివారం రాణా కపూర్‌ను మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం కింద సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆదివారం రానాకపూర్ భార్యను కూడా ఈడీ అధికారులు కార్యాలయంలో విచారించారు. ముంబైలోని వొర్లీ ప్రాంతంలో కపూర్ నివాసం సముద్ర మహల్లో తదితర ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. రానాకపూర్ నేతృత్వంలో యస్ బ్యాంక్ పెద్ద మొత్తంలో DHFLకు జారీ చేసిన రుణాలు నిరర్థక ఆస్తులుగా(NPA) మారాయని ఈడీ చెబుతోంది.

 YES Banks Rana Kapoor sent to ED custody till March 11

ఇదిలా ఉండగా యస్ బ్యాంకు కస్టమర్లకు ఆ బ్యాంకు ఊరట కల్పించిన విషయం తెలిసిందే. కస్టమర్లు తమ డెబిట్ కార్డును ఉపయోగించి ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా నగదు విత్ డ్రా చేసుకోవచ్చని ట్వీట్ చేసింది. యస్ బ్యాంకులో ఎస్బీఐ 49% వాటాను కొనుగోలు చేయనుంది. యస్ బ్యాంకు ఉద్దీపన ప్రణాళిక కింద ఎస్బీఐ తన నివేదికను సోమవారం ఆర్బీఐకి సమర్పిస్తుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+