Yes Bank crisis: అనిల్ అంబానీకి ఈడీ సమన్లు, అందుకే
యస్ బ్యాంకు సంక్షోభంలో మరో కీలక పరిణామం. ఈ కేసుకు సంబంధించి అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. బ్యాంకు వ్యవస్థాపకులు రానా కపూర్ను ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో అధికారులు అరెస్టు చేసి విచారించారు. తాజాగా అనిల్ అంబానీకి సమన్లు ఇవ్వడం గమనార్హం. ముంబైలోని ఈడీ కార్యాలయంలో సోమవారం హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే అనారోగ్య కారణాల వల్ల తాను సోమవారం విచారణకు హాజరు కాలేనని అనిల్ అంబానీ ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. అనిల్ అంబానీతో పాటు యస్ బ్యాంకు నుండి రుణాలు పొందిన కంపెనీల ప్రమోటర్లందరికీ సమన్లు జారీ చేశారు. అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు యస్ బ్యాంకు నుండి పొందిన రుణాలు నిరర్థక ఆస్తులుగా మారినట్లు ఈడీ గుర్తించింది. దీంతో నోటీసులు జారీ చేసింది.
Yes bank crisis: వచ్చే ఆర్థిక సంవత్సరంలోను ఎన్పీఏ కష్టాలు
అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు యస్ బ్యాంకు నుండి రూ.12,800 కోట్ల రుణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇవి నిరర్థక ఆస్తులగా మారాయట. మార్చి 6వ తేదీన నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అనిల్ అంబానీ గ్రూప్ పేరుతో పాటు ఎస్సెల్, ఐఎల్ఎప్ఎస్, డీహెచ్ఎఫ్ఎల్ తదితర గ్రూపులను ప్రస్తావించారు.