For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిన్న పెరిగి, నేడు మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు: రూ.51,000కు పైనే..

|

ముంబై: బంగారం, వెండి ధరలు గురువారం (అక్టోబర్ 22) ప్రారంభ సెషన్‌లో తగ్గుముఖం పట్టాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX) డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.223 (0.43 శాతం) క్షీణించి రూ.51,110 వద్ద ట్రేడ్ అయింది. రూ.51,199 వద్ద ట్రేడింగ్ ప్రారంభం కాగా, అదే ధర గరిష్టం కాగా, రూ.51,064 వద్ద కనిష్టాన్ని తాకింది. ఇటీవల బంగారం ధరలు పెరుగుతున్నాయి. అమెరికా ఆర్థిక ప్యాకేజీపై స్పష్టత, సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ క్షీణించడంతో పసిడిపై ఒత్తిడి పెరిగింది. అయితే తాజాగా డాలర్ వ్యాల్యూ పెరగడంతో పసిడి, వెండి ధరలు తగ్గాయి.

'అలీబాబా' జాక్‌మా సహా భారీగా పెరిగిన చైనా కుబేరుల సంపద: 50% పైగా ఆదాయం జంప్'అలీబాబా' జాక్‌మా సహా భారీగా పెరిగిన చైనా కుబేరుల సంపద: 50% పైగా ఆదాయం జంప్

రూ.200కు పైగా తగ్గిన పసిడి ధర

రూ.200కు పైగా తగ్గిన పసిడి ధర

బంగారం ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.220 (0.43 శాతం) క్షీణించి పది గ్రాముల ధర రూ.51స166 వద్ద ట్రేడ్ అయింది. రూ.51,226 వద్ద ప్రారంభమైన ధర, అదే ధర గరిష్టం కాగా, రూ.51,166 వద్ద కనిష్టాన్ని తాకింది.ఆగస్ట్ 7న ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు రూ.56,200తో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. ఆ ధరతో రూ.5,000 వరకు తక్కువ పలికింది. నిన్న బంగారం ధర రూ.500 వరకు పెరిగిన విషయం తెలిసిందే. ఈ రోజు రూ.200కు పైగా క్షీణించింది.

రూ.700కు పైగా తగ్గిన వెండి ధర

రూ.700కు పైగా తగ్గిన వెండి ధర

వెండి ధర కూడా బంగారం దారిలోనే క్షీణించింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.729(1.15 శాతం) క్షీణించి రూ.62,900 పలికింది. రూ.61,111వద్ద ప్రారంభమైంది. గరిష్టం కూడా కూడా ఇదే. రూ.62,766 వద్ద కనిష్టాన్ని తాకింది.

మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.744 (1.14 శాతం) క్షీణించి రూ.64,563 వద్ద ట్రేడ్ అయింది. రూ.64,589 వద్ద ప్రారంభమైన ధర రూ.64,609 వద్ద గరిష్టాన్ని, రూ.64,540 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ హై రూ.79వేలతో వెండి ఇప్పటికీ రూ.17వేలకు పైగా తక్కువ పలుకింది.

బంగారం, వెండి ధరలు తగ్గుముఖం

బంగారం, వెండి ధరలు తగ్గుముఖం

అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు తగ్గాయి. ఔన్స్ పసిడి 0.69 శాతం క్షీణించి 1,916.35 డాలర్లు పలికింది. 1,913.05 - 1,929.40 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1,929.50 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. నేడు 1928 డాలర్ల వద్ద ప్రారంభమైంది. ఏడాదిలో ధర 26.89 శాతం పెరిగింది.

వెండి ధర కూడా 1.47 శాతం క్షీణించి ఔన్స్ 24.867 డాలర్లు పలికింది. 24.775 - 25.215 డాలర్ల మధ్య పలికింది. క్రితం సెషన్‌లో 25.241 డాలర్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది వెండి 41.23 శాతం పెరిగింది.

English summary

నిన్న పెరిగి, నేడు మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు: రూ.51,000కు పైనే.. | Yellow metal holds above Rs 51,000; Silver down over 1 percent

Gold and silver prices fell today in futures market in India in tandem with a decline in global markets. On MCX, December gold futures fell 0.45% to ₹51,100 per 10 gram while silver futures declined 1.2% to ₹62,847 per kg. In the previous session, gold had risen 0.7% as it extended gains to the third day while silver rates on MCX had advanced 0.7%.
Story first published: Thursday, October 22, 2020, 11:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X