ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒకటే చర్చ. కరోనా వైరస్ తప్ప మరోటి లేదు. చైనా లో పుట్టిన ఈ మాయదారి మహమ్మారి ప్రపంచం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే 18 లక్షల మందికి సోకిన ఈ భయంకరమైన వైరస్... సుమారు 1 లక్ష మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంది. ముఖ్యంగా ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా వంటి పెద్ద దేశాలు ఈ మహమ్మారి బారిన పడి విలవిల లాడుతున్నాయి.
ప్రపంచంలోనే అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదు కావటం, మరణాల్లోనూ నెంబర్ వన్ స్థానానికి చేరున్న అగ్రరాజ్యం ... తాను ఏ విషయంలోనైనా నెంబర్ వనే అని నిరూపించుకుంది. భారత దేశం విషయానికి వస్తే లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయటం వల్ల బతికిపోయాం కానీ... లేదంటే మన దేశంలో ఉన్న సౌకర్యాలతో ఈ వైరస్ పై పోరాటం చేయటం సాధ్యమయ్యేది కాదు.
135 కోట్ల మంది ప్రజలు, అరకొర వసతులున్న భారత్ లో కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం పెరిగినా తట్టుకునే శక్తి మనకు లేదని పాలకులకు తెలుసు. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని దేశాన్ని, ప్రజలను కాపాడే ప్రయత్నం చేశారు. దీంతో ప్రపంచ దేశాలతో ఔరా అనిపించుకుంటున్నారు. ఐతే, ఇప్పుడు మరో టాపిక్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అదే వర్క్ ఫ్రొం హోమ్.

లాభాలు భళా...
వర్క్ ఫ్రొం హోమ్ అనే కాన్సెప్ట్ కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి మాత్రమే పరిమితయ్యేది. అది కూడా కొన్ని కంపెనీలు, కొన్ని విభాగాలకు పరిమితంగా ఉపయోగించేవారు. కానీ, ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి వల్ల దేశంలో లాక్ డౌన్ విధించారు. దీంతో అన్ని కంపెనీలు, ఫ్యాక్టరీ లు మూత పడ్డాయి. కొన్ని రంగాల్లో అవసరమైన మేరకు వర్క్ ఫ్రొం హోమ్ అమలు చేస్తున్నారు.
ఎప్పుడూ చూడని విధంగా దేశంలో తొలిసారి మీడియా రంగం కూడా వర్క్ ఫ్రొం హోమ్ బాట పట్టింది. పేపర్లు కూడా ప్రింట్ కంటే డిజిటల్ వెర్షన్ లో ఎక్కువ కవరేజ్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో, చాలా ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ఆఫీస్ లు మూసివేయటంతో కరెంటు బిల్లులు, మైంటెనెన్సు, స్టేషనరీ ఖర్చులు కలిసివస్తున్నాయి. ఇంటర్నెట్ బిల్లులు కూడా కలిసివస్తున్నాయి. దీంతో, చాలా కంపెనీలకు అడ్మినిస్ట్రేషన్, జనరల్ ఎక్సపెన్డ్డిచార్ వ్యయాలు తగ్గిపోయాయి.

పని చేస్తున్నారా...?
ఏదో తప్పనిసరి కాబట్టి వర్క్ ఫ్రొం హోమ్ ఆప్షన్ ఇచ్చాం. కానీ, ఉద్యోగులు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అనే ఆందోళన కంపెనీల్లో ఉంది. కానీ, వారు ఈ సయమంలో ప్రతి రోజు పని పూర్తి అయిన తర్వాత డైలీ టాస్క్ రిపోర్ట్ సమర్పించాలని కోరుతున్నారు. అందులో ఏ పనికి ఎంత సమయం పట్టిందో తెలిపేలా చర్యలు తీసుకుంటున్నారు.
దీంతో ఉద్యోగులకు పని తో పాటు ప్రతి రోజు రిపోర్టులు పంపించే అదనపు బాధ్యతలు కూడా అప్పజెపుతున్నారు. కొన్ని రంగాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రొం హోమ్ చేయటం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతోందని ఉద్యోగులు వాపోతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. ఒకప్పుడు 9 టూ 5 జాబ్ అయితే... ఇప్పుడు 5 టూ 9 అయిపోయిందని... దీంతో కొంత ఒత్తిడికి లోనవుతున్నామని కూడా ఉద్యోగులు కంప్లైన్ చేస్తున్నారు. అయితే, మార్కెటింగ్ వంటి కొన్ని తప్పనిసరిగా ఫీల్డ్ లోకి వెళ్లే జాబ్స్ లో మాత్రం ప్రస్తుతం ఎలాంటి ఉత్పాదక లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

అందుకే కంటిన్యూ...
దేశంలో ఇప్పటికీ వ్యవసాయ రంగంపై సుమారు 65% ప్రజలు ఆధారపడుతున్నారు. వారికి పూర్తి జీవనాధారం వ్యవసాయమే. ఇక సంఘటిత, అసంఘటిత రంగాల్లో కలిపి సుమారు 30 కోట్ల మంది ప్రజలు వివిధ రంగాల్లో తమ సేవలు అందిస్తున్నారు. వీరిలో ఒక్క తయారీ (మ్యానుఫ్యాక్చరింగ్), లాజిస్టిక్స్ రంగాలు, ఫ్రంట్ ఆఫీస్, ఫ్రంట్ ఆఫీస్ సేల్స్ వంటి ఉద్యోగాలు తప్ప మిగితావన్నీ వర్క్ ఫ్రొం హోమ్ ద్వారా కూడా చేయవచ్చు.
దేశంలో 4జి విస్తృతి, మొబైల్ డేటా వినియోగం పెరిగిపోవటం, ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ మెరుగ్గా ఉండటంతో ఆఫీస్ అయినా.. ఇల్లు అయినా పనిచేయటానికి పెద్ద తేడా ఉండటం లేదు. మునుముందు స్టార్టుప్ కంపెనీలు, చిన్న, మధ్యతరహా కంపెనీలు పెద్ద పెద్ద ఆఫీస్ లు కలిగి ఉండే బదులు, చిన్న కార్యాలయాలు, వర్చువల్ కార్యాలయాల ద్వారా నెట్టుకొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో అటు వ్యయాలు తగ్గుతాయి, ఇటు ప్రజా రవాణా వ్యవస్థపై భారం తగ్గి కాలుష్యం కూడా తగ్గిపోతుంది. ఇలాంటి అనేక ప్రయోజనాల వల్ల లాక్ డౌన్ తర్వాత చాలా కంపెనీలు తప్పనిసరిగా తమ మానవ వనరుల విధానాల్లో వర్క్ ఫ్రొం హోమ్ అనే అంశాన్ని చేరుస్తాయని చెబుతున్నారు.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications