అమెరికా-భారత్ మధ్య జరగాల్సిన వాణిజ్య చర్చలు వాయిదా పడ్డాయి. అమెరికా భారత వస్తువులపై 25% అదనపు సుంకాలు వేయాలని భావిస్తున్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై మళ్లీ ప్రశ్నలు వస్తున్నాయి.

చర్చలు ఎందుకు రద్దయ్యాయి?
ఆగస్టు 25 నుంచి 29 వరకు న్యూఢిల్లీకి అమెరికా వాణిజ్య ప్రతినిధుల బృందం రావాల్సి ఉంది. కానీ ఈ పర్యటనను వాయిదా వేశారు. "ఇప్పుడే రావడం సాధ్యం కాదని, కానీ త్వరలో మళ్లీ కొత్త తేదీలు ఖరారు అవుతాయి" అని సమాచారం.
అమెరికా-భారత్ ప్రభుత్వాలు చాలా రోజులుగా ఒక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Bilateral Trade Agreement) కోసం చర్చలు కొనసాగిస్తున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాలు ఒకరికొకరు వ్యాపారంలో సులభతరం చేసే నిబంధనలు, సుంకాల తగ్గింపులు, కొత్త మార్కెట్ అవకాశాలు వంటి విషయాలను నిర్ణయించుకోవాలి.
కానీ, ఈ సారి వాణిజ్య చర్చలు రద్దు కావడంతో ఆ ఒప్పందం పూర్తి కావడంలో ఆలస్యం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు ప్లాన్ ప్రకారం ఆగస్టు చివరినాటికి చర్చల ఒక దశను ముగించాలి. తర్వాతి దశలో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ఒప్పందం ఫైనల్ చేయాలని ముందుగా లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇప్పుడు ఆ టైమ్లైన్ వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. అంటే, కొత్త ఒప్పందం కుదరడం కొంతకాలం వాయిదా పడుతుంది. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలకు తాత్కాలికంగా అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది.
భారత ప్రభుత్వం ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పింది అమెరికా ఒక అత్యంత ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి అని రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలు కేవలం వస్తువులు కొనడం-అమ్మడం వరకే కాకుండా, పెట్టుబడులు, ఉద్యోగాలు, టెక్నాలజీ మార్పిడి, కొత్త పరిశ్రమల అభివృద్ధి వంటి అనేక రంగాలను ప్రభావితం చేస్తాయి.
అందుకే ప్రభుత్వం అన్ని స్థాయిల్లో చర్చలు కొనసాగుతున్నాయని చెబుతోంది అంటే, కేవలం కేంద్ర స్థాయిలోనే కాదు, మంత్రులు, అధికారులు, సాంకేతిక బృందాలు అందరూ కలిసి వివిధ అంశాలపై సమావేశాలు జరుపుతున్నారు. ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడం, సేవలకు మరిన్ని అవకాశాలు కల్పించడం, పెట్టుబడిదారులకు భద్రత ఇవ్వడం, ఐటి రంగం, ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి ఇలాంటి అనేక అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా ఉంటాయి.
ఇప్పుడు దేశాల మధ్య విభేదాలు ఉన్నా, అవి తాత్కాలికం మాత్రమే. అసలు లక్ష్యం ఏమిటంటే, అమెరికాతో బలమైన వాణిజ్య సంబంధాలు కొనసాగించడం, వాటిని మరింత పెంచడం. ఈ కారణంగా, రాబోయే నెలల్లో మళ్లీ చర్చలు పునరుద్ధరించి, రెండు దేశాలకు లాభదాయకంగా ఉండే నిర్ణయాలకు రావడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఆగస్టు 25న జరగాల్సిన ఈ వాణిజ్య చర్చలు వాయిదా కావడం చిన్న విషయం కాదు. అమెరికా 25% అదనపు సుంకాల నేపథ్యంలో, ఈ చర్చల ద్వారా కొంత ఉపశమనం లభిస్తుందని ఆశించారు. ఇప్పుడు కొత్త తేదీలు ఎప్పుడు ఖరారవుతాయో చూడాలి. రెండు దేశాలకీ వ్యాపార సంబంధాలు అత్యంత అవసరం కావడంతో, త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది.
More From GoodReturns

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

ఇరాన్ యుద్ధం త్వరలో ముగుస్తుంది.. ప్రపంచం మళ్లీ ప్రశాతంగా ఉంటుంది..ట్రంప కీలక వ్యాఖ్యలు

అమెరికాకు భారీ షాకిచ్చిన ఇరాన్.. 4 వేల మైళ్ల దూరం నుంచి డియాగో గార్సియా సైనిక స్థావరంపై దాడి..

ఖతార్ LNG ప్లాంట్పై ఇరాన్ క్షిపణి దాడి.. ట్రంప్ ఆందోళన.. గ్లోబల్ ఇంధన సంక్షోభం..

ఇరాన్ను ఎదిరించలేని పిరికిపందలు..మీ చావు మీరు చావాలంటూ నాటో దేశాలపై విరుచుకుపడిన ట్రంప్..

ట్రంప్ మరో భారీ స్కెచ్.. ఇరాన్ హార్ట్ అయిన ఖర్గ్ ద్వీపంపై కన్ను.. ఏ క్షణమైనా మిసైళ్లతో దాడి..

ఉచిత విమాన టికెట్లు, 2,600 డాలర్లు మనీ ఇస్తాం.. అమెరికా వదిలి వెళ్లిపోవాలంటూ భారతీయులకు ఆఫర్..

హార్ముజ్ జలసంధి వివాదం..అమెరికాకు చైనా బిగ్ షాక్.. వెంటనే సైనిక చర్యలు ఆపాలని డిమాండ్..

ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..

Green card: పాకిస్థానీలకు 2 ఏళ్లు.. మనకు 134 ఏళ్లు.. అమెరికా వీసా రూల్స్లో ఈ తేడా ఎందుకు?

విమాన ప్రయాణీకులకు గుడ్ న్యూస్! ఇకపై దానికి ఎక్స్ ట్రా ఛార్జీ అవసరం లేదు!



Click it and Unblock the Notifications