దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్ శుక్రవారం కూజా ఒత్తిడి కనిపిచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 1.53 శాతం లేదా రూ. 23.70 పడిపోయి రూ.1529.65 వద్ద ముగిసింది. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో షేరు 6.11 శాతం క్షీణించింది. బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1 లక్ష కోట్ల నష్టాన్ని చవిచూసింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.11,59,495 కోట్లకు తగ్గింది.
సెన్సెక్స్, నిఫ్టీ రెండు సూచీలలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యధిక వెయిటేజీని కలిగి ఉన్నందున, భారతీయ స్టాక్ మార్కెట్లో క్షీణతలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రధాన పాత్ర వహించింది. స్టాక్కు సంబంధించి క్షీణించిన సెంటిమెంట్ కారణంగా, విదేశీ పెట్టుబడిదారులు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లను భారీగా విక్రయించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజ్మెంట్, హెచ్డీఎఫ్సీలో విలీనం తర్వాత, బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ తగ్గే అవకాశం ఉందని తెలిపింది. నికర వడ్డీ మార్జిన్ 25 బేసిస్ పాయింట్ల మేర ప్రభావితం కావచ్చని మేనేజ్మెంట్ చెబుతోంది.

అలాగే, అసెట్ క్వాలిటీ రేషియో తగ్గుముఖం పట్టడంపై చర్చ జరుగుతోంది. విలీనం తర్వాత కొత్త సంస్థ స్థూల ఎన్పీఏ నిష్పత్తి 1.2 శాతం నుంచి 1.4 శాతానికి పెరిగిందని, నికర ఎన్పీఏ 0.3 శాతం నుంచి 0.4 శాతానికి పెరిగిందని బ్యాంక్ మేనేజ్మెంట్ తెలిపింది. ఈ కారణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒత్తిడి కనిపిస్తోన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ క్షీణత ఉన్నప్పటికీ, బ్రోకరేజ్ సంస్థలు స్టాక్కు సంబంధించి మిశ్రమ వైఖరిని కలిగి ఉన్నాయి. కొన్ని బ్రోకరేజ్ సంస్థలు టార్గెట్ ధరను రూ. 1800కి తగ్గించాయి. అయితే కొన్ని బ్రోకరేజ్ సంస్థలు రాబోయే రోజుల్లో స్టాక్ ప్రస్తుత స్థాయి నుంచి 50 శాతం రాబడిని ఇవ్వగలవని చెబుతున్నాయి. HDFC బ్యాంక్ షేర్లు ఒక సంవత్సరంలో పెట్టుబడిదారులకు 3 శాతం రాబడిని అందించగా, స్టాక్ ఒక వారంలో 8 శాతం, 2023లో 6 శాతం క్షీణించింది. అయితే, ఈ స్టాక్ 3 సంవత్సరాలలో పెట్టుబడిదారులకు 48 శాతం రాబడిని ఇచ్చింది.


Click it and Unblock the Notifications