Union Budget 2021: నిర్మలా సీతారామన్ ముందు 3 కీలక సవాళ్లు?

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు (సోమవారం, ఫిబ్రవరి 1) ఉదయం గం.11 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. స్వతంత్ర చరిత్రలో తొలిసారి ఈసారి బడ్జెట్‌ను పేపర్‌లెస్‌గా పార్లమెంటుకు సమర్పిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్ డాక్యుమెంట్స్ ముద్రణ చేపట్టలేదు. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ కూడా బడ్జెట్‌ పత్రాలకు బదులు ల్యాప్‌టాప్‌తో పార్లమెంటుకు బయల్దేరారు.

బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు నిర్మలా సీతారామన్ బృందం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిసింది. అనంతరం పార్లమెంటుకు బయలుదేరారు. నిర్మల చేతిలో సంప్రదాయ బడ్జెట్ ప్రాలకు బదులు మేడిన్ ఇండియా ట్యాబ్ ఉంది. గతంలో బడ్జెట్ కాపీలను ఆర్థిక మంత్రులు లెదర్ సూట్‌కేసుల్లో తీసుకు వచ్చేవారు. 2019, 2020లో నిర్మలా సీతారామన్ సంప్రదాయ వస్త్రం లాంటి సంచిలో బడ్జెట్ పత్రాలు తెచ్చారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ట్యాబ్‌లో బడ్జెట్‌ను తీసుకు వస్తున్నారు.

What are key challenges that Nirmala Sitharaman needs to address?

నిర్మలమ్మ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. కరోనా తర్వాత ఆర్థిక వృద్ధి మెరుగ్గా కనిపించినప్పటికీ దేశంలో ఉపాధి ఇంకా కరోనా ముందుస్థాయికి చేరుకోలేదు. నిరుద్యోగాలు పెరుగుతున్నాయని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE) తెలిపింది. డిమాండ్ భారీగా క్షీణించిందని, వినియోగం పెంచే చర్యలు తీసుకోవాల్సి ఉంది. కీలకమైన వృద్ధి కేంద్రీకృత రంగాలలో పెట్టుబడులను పెంచడం మరో అంశం. నిర్మలమ్మ ముందు ఇలా పలు సవాళ్లు ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+