అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వ్యవస్థ శరవేగంగా మారుతున్న తరుణంలో అమెరికా ఇకపై ప్రపంచాన్ని ఏకపక్షంగా నడిపించే శక్తి కాదనే వాస్తవం మరింత స్పష్టమవుతోంది. భారత్, చైనా కేంద్రంగా ఒక కొత్త ప్రపంచ క్రమం (New World Order) రూపుదిద్దుకుంటోందన్న అభిప్రాయం వాషింగ్టన్ పాలసీ వర్గాల్లో ఆందోళనకు దారి తీస్తోంది. ముఖ్యంగా భారతదేశంపై అమెరికా విధించిన సుంకాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో.. న్యూఢిల్లీ తన వ్యూహాత్మక దిశను మరింత స్పష్టంగా మార్చుకుంటోంది.
అమెరికా టారిఫ్ ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా..ఫైటర్ జెట్లు, కృత్రిమ మేధస్సు (AI), సెమీకండక్టర్లు, ఔషధ రంగం వంటి కీలక వ్యూహాత్మక విభాగాల్లో పట్టు సాధించడంపై భారత్ దృష్టి సారించింది. విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ.. దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక, జాతీయ భద్రతను బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదే సమయంలో భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు జరుగుతున్నాయి. సరిహద్దు వివాదాలను నియంత్రణలో ఉంచుతూ.. ఆర్థిక సహకారం, వ్యూహాత్మక సంభాషణలను కొనసాగించాలనే దిశగా న్యూఢిల్లీ, బీజింగ్ అడుగులు వేస్తున్నాయి. భారత్, China రెండూ ఇప్పటికే రష్యాతో బలమైన సంబంధాలను కొనసాగిస్తున్నాయి. ఇది అమెరికా ఆధిపత్యానికి సవాల్గా మారుతోందన్న భావన వాషింగ్టన్లో పెరుగుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో..ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మారుతున్న శక్తి సమతుల్యతపై వార్షిక విచారణ నిర్వహించేందుకు యుఎస్-చైనా ఆర్థిక, భద్రతా సమీక్ష కమిషన్ (USCC) నోటీసు జారీ చేసింది. ఈ కీలక విచారణ ఫిబ్రవరి 17, 2026న వాషింగ్టన్ డీసీలో జరగనుంది. ఇది కమిషన్ 2026 రిపోర్టింగ్ సైకిల్లో నిర్వహించే తొలి పబ్లిక్ హియరింగ్ కావడం విశేషం.
కమిషన్ నోటీసు ప్రకారం.. ఈ విచారణలో భారత్కు సంబంధించిన భౌగోళిక రాజకీయ, సైనిక అంశాలు ప్రధానంగా పరిశీలించబడతాయి. భారత్-చైనా మధ్య వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల ఉద్రిక్తతలు, హిందూ మహాసముద్రంలో సముద్ర ప్రాప్యత, ఇండో-పసిఫిక్ శక్తిగా భారతదేశం పాత్ర వంటి అంశాలు విచారణలో కీలకంగా నిలవనున్నాయి. అంతేకాదు వాణిజ్యం, పెట్టుబడులు, కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, ఔషధ సరఫరా గొలుసులు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో భారత్-చైనా ఆర్థిక, సాంకేతిక సంబంధాలు కూడా సమీక్షకు లోనవుతాయి.
అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి వాషింగ్టన్ చేపడుతున్న విధాన ప్రయత్నాలు, అలాగే భారత్-చైనా సన్నిహిత సంబంధాలు అమెరికా ఆర్థిక, జాతీయ భద్రతా ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయన్న అంశాన్ని కూడా కమిషన్ పరిశీలించనుంది. ఈ విచారణకు కమిషనర్ హాల్ బ్రాండ్స్, కమిషనర్ జోనాథన్ ఎన్. స్టివర్స్ సహ-అధ్యక్షత వహించనున్నారు.
ఇదిలా ఉండగా భారతదేశం తాజాగా విడుదల చేసిన ఆర్థిక సర్వేలో AI విప్లవానికి తన దిశను స్పష్టంగా వెల్లడించింది. సర్వే డేటాను ఉటంకిస్తూ.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఒక కీలక వ్యాఖ్య చేసింది. భారత్లో AI స్వీకరణ, నియంత్రణ సంస్కరణలు, చురుకైన వ్యాపార వాతావరణం కలిసివస్తే..ఆర్థిక వృద్ధిలో తదుపరి భారీ దశ ప్రారంభమవుతుందని IMF పేర్కొంది. ఆవిష్కరణలను ప్రోత్సహించడం, సంస్థలు విస్తరించడానికి ఉన్న అడ్డంకులను తగ్గించడం ద్వారా ఉత్పాదకత దాదాపు 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.క్లుప్తంగా చెప్పాలంటే భారత్ అన్ని రంగాల్లో సాంకేతిక శక్తిగా ఎదుగుతున్న తీరు అమెరికా ప్రపంచ ఆధిపత్య వ్యవస్థకు కొత్త సవాళ్లను విసురుతోందని చెప్పవచ్చు. ఇండో-పసిఫిక్లో మారుతున్న శక్తి సమతుల్యతపై వాషింగ్టన్లో ఆందోళనకు బీజం వేసిందని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం.. ధరల పెరుగుదలతో పలు దేశాలు విలవిల..

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

Iran war: ఇరాన్లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ఏం జరుగుతోంది?

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

Iran war: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు బాంబు తయారీ ఆపేస్తాం! కానీ ఆ ఒక్క కండిషన్!

ఇరాన్ మీద దాడులు.. బట్ట బయలైన అమెరికా కుట్రలు.. ప్రపంచానికి నిజాన్ని తెలిపిన స్పెయిన్..

ఇరాన్–అమెరికా యుద్ధంపై షాకింగ్ న్యూస్.. ఎవరి ఆయుధాలు ముందుగా అయిపోతాయో తెలుసా..

భారత ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తున్న గల్ఫ్ యుద్ధ మంటలు.. ప్రమాదంలో 9 కోట్ల మంది పంపే డబ్బు ..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..



Click it and Unblock the Notifications