భారత బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టులో చుక్కెదురైంది. ఎస్బీఐ నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్టియం వేసిన పిటిషన్ను లండన్ హైకోర్టు అనుమతించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రుణాల కోసం హామీగా పెట్టుకున్న ఆస్తులపై బ్యాంకులకు ఎలాంటి హక్కు లేదన్న మాల్యా న్యాయవాదుల వాదనను కోర్టు తోసిపుచ్చింది.
ఈ కేసుపై తుది విచారణను జూలై 26వ తేదీకి వాయిదా వేసింది. దీంతో విజయ్ మాల్యా నుండి రావాల్సిన రూ.14,000 కోట్ల బకాయిలను రాబట్టుకునేందుకు బ్యాంకులు చేస్తోన్న ప్రయత్నాలు త్వరలో సఫలం అవుతాయని భావిస్తున్నారు. మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం బ్యాంకులు ఈ రుణాలు అందించాయి.

చీఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్టు (ICC) జడ్జి బ్రిగ్స్ ఈ కేసులో మాల్యా తరఫు లాయర్ పిలిప్ మార్షల్ వాదనలను వినేందుకు జూలై 26వ తేదీన అవకాశం ఇచ్చారు. మాల్యాను భారత్కు రప్పించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోన్న విషయం తెలిసిందే.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications