ప్రస్తుతం దేశం మొత్తం కుంభమేళా వైపు చూస్తుంది. మరోవైపు రేపు శివరాత్రి పురస్కరించుకొని గుడిలు, దేవాలయాలు సిద్ధమవుతున్నాయి. సాధారణంగానే ఫ్లయిట్ టిక్కెట్లు కాస్త అధికంగా ఉంటాయి. ఇంకా ఇలాంటి సమయంలో విమాన టిక్కెట్లు ధర చెప్పనవసరం లేదు. కానీ మీరు కొన్ని విమానయాన సంస్థల టికెట్స్ గమనిస్తే మీరు తక్కువ ధరకే టిక్కెట్లను కొనవచ్చు. ఉదాహరణకు, ఇటీవల వియత్నాం విమానయాన సంస్థ వియత్జెట్ భారతీయుల కోసం హోలీ సేల్ను ప్రారంభించింది. ఈ సందర్భంగా భారతీయ ప్రయాణికులకు వన్-వే ఎకానమీ క్లాస్ ఛార్జీలు కేవలం 11 రూపాయలకే అందిస్తుంది.
ఆఫర్ ఏంటంటే ?
వియత్నాం భారతదేశంలోని అన్ని నగరాల నుండి వియత్నాం నగరాలకు వెళ్లే విమానాలలోని వియత్జెట్ ఈ సేల్ అమలు చేసింది. ఇందులో వన్-వే ఎకానమీ క్లాస్ ఛార్జీ రూ.11 నుండి ప్రారంభమవుతుంది. అయితే టికెట్ ఛార్జ్ మొత్తానికి అదనంగా పన్నులు ఇంకా ఇతర విమానాశ్రయ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ ప్రస్తుతం అందరికి అందుబాటులో ఉంది ఇంకా
28 ఫిబ్రవరి 2025 వరకు కొనసాగుతుంది. ఈ ఆఫర్ కింద మార్చి 10 నుండి సెప్టెంబర్ 30, 2025 మధ్య ప్రయాణం చేయవచ్చు అంతేకాదు ఈ అఫర్ భారతదేశం నుండి వియత్నాంకు వెళ్లే అన్ని రూట్లలో వర్తిస్తుంది.

ఇండియాలోని ఈ నగరాల నుండి విమానాలు
న్యూఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, కొచ్చి, హైదరాబాద్, బెంగళూరు నుండి వియత్నాంలోని ప్రధాన నగరాలు హనోయ్, వియత్నాం రాజధాని హో చి మిన్ సిటీ ఇంకా డా నాంగ్ లకు ప్రయాణించే విమానాలలో భారతీయ ప్రయాణికులు ఈ ప్రత్యేక ఆఫర్ పొందవచ్చు. టికెట్ బుకింగ్ కోసం మీరు వియత్జెట్ అధికారిక వెబ్సైట్ (www.vietjetair.com) ఇంకా వియత్జెట్ ఎయిర్ మొబైల్ యాప్ ఉపయోగించవచ్చు.
రెండు డైరెక్ట్ విమానాలు
భారతదేశం నుండి వియత్నాం మధ్య అత్యధిక విమానాలను నడిపే విమానయాన సంస్థగా వియత్జెట్ క్రమంగా అడుగులు వేస్తోంది. మార్చి 2025లో వియట్జెట్ బెంగళూరు ఇంకా హైదరాబాద్లను హో చి మిన్ సిటీకి అనుసంధానిస్తూ రెండు కొత్త డైరెక్ట్ విమానాలను ప్రారంభించబోతోంది. దీనితో భారతదేశం-వియత్నాం మధ్య ఫ్లయిట్ నెట్వర్క్ మొత్తం 10 మార్గాలలో ఉంటుంది ఇంకా ప్రతి వారం 78 విమానాలు నడపబడతాయి.
యాక్సెస్ ఈజీ
వియత్జెట్ బలమైన దేశీయ నెట్వర్క్ కారణంగా హనోయ్, హో చి మిన్ సిటీ ఇంకా డా నాంగ్ నుండి భారతీయ ప్రయాణికులు వియత్నాంలోని ఇతర ఫెమస్ పర్యాటక ప్రదేశాలకు సులభంగా చేరుకోవచ్చు. అదనంగా వియత్నాంను సింగపూర్, కౌలాలంపూర్, బాలి, ఆస్ట్రేలియా ఇంకా ఈశాన్య ఆసియాలోని ప్రముఖ నగరాలతో సహా ఆసియా-పసిఫిక్లోని పర్యాటక ప్రదేశాలకు కూడా వియత్నాంను కలుపుతుంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications