AI News: ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఉన్నోడికే పెళ్లి పెటాకులు అన్నట్లుగా తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ కొనసాగుతోంది. ఒకప్పుడు డాక్టర్లు, భూస్వాములు, పొలిటీషియన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న డిమాండ్ ఇప్పుడు ఐటీ ఉద్యోగులకు కొనసాగుతోంది. పిల్లనివ్వాలంటే ముందు ప్యాకేజీ ఎంత అని అడుగుతున్న రోజులివి. అయితే ఇది భవిష్యత్తులో కనుమరుగు కావచ్చని తెలుస్తోంది.
విషయానికి వస్తే ప్రపంచంలో ఉద్యోగాల తీరుతెన్నులను ఏఐ పూర్తిగా మార్చేస్తోంది. నిన్నమెున్నటి వరకు కొనసాగిన టెక్కీల అవసరం ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. దీంతో ప్రపంచంలోని పెద్ద ఐటీ సేవల కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు తమ నియామక సరళిని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఉద్యోగులు వద్దు ఏఐ ముద్దు అన్నట్లుగా సదరు కంపెనీలు నూతన ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయి. మనుషుల ఖర్చులను తగ్గించుకోవటానికి ఇది వారికి పెద్ద అస్త్రంగా పనిచేస్తోంది.

ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన సేల్స్ఫోర్స్ కంపెనీ ఈ ఏడాది కొత్తగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించుకోబోమని తేల్చి చెప్పేసింది. వాస్తవానికి ఇది పెద్ద సంచలన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో మరిన్ని టెక్ కంపెనీలు ఇదే దారిని ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. యూఎస్ లోని శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ సీఈవో మార్క్ ఈ విషయాన్ని ఒక పాడ్కాస్ట్ లో బాహాటంగా చెప్పటం ఐటీ పరిశ్రమపై ఆధారపడి ఉన్న లక్షల మంది భారతీయులను కలవరానికి గురిచేస్తోంది.
ప్రస్తుతం కంపెనీ ఏజెంట్ ఫోర్స్ అనే ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై తన దృష్టిని కొనసాగిస్తున్న వేళ ఈ ప్రకటన వచ్చింది. ఏజెంట్ ఫోర్స్ AI, ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీల ద్వారా తన కంపెనీ ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని దాదాపు 30 శాతం పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. అందువల్లే ఈ ఏడాది నియామకాలు వద్దనుకున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో సపోర్టు ఇంజనీర్ ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందని, సేల్స్ విభాగంలో ఉద్యోగుల సంఖ్యను పెంచనున్నట్లు స్పష్టం చేశారు. సేల్స్ ఉద్యోగుల సంఖ్యను డబుల్ చేయనున్నట్లు చెప్పారు.
మార్కెట్లో ఏఐ గురించి వివరంగా వివరించి మార్కెటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న సేల్స్ ప్రతినిధులను నియమించుకుంటున్నట్లు తెలిపారు. దీనికి అనుగుణంగానే సేల్స్ఫోర్స్ ఇండియా సీఈఓ అరుంధతీ భట్టాచార్య మాట్లాడుతూ కంపెనీలో ఏఐ పాత్రను పెంచుతున్నట్లు ధృవీకరించారు. ఇది ఉద్యోగుల స్థితిని మార్చటంతో పాటు కొన్ని ఉద్యోగాలను కనుమరుగుచేస్తుందని అభిప్రాయపడ్డారు.
సాంకేతిక పురోగతి మంచిదే అయినప్పటికీ అది సృష్టించే కొన్ని మార్పుల్లో భాగంగా పాత్రలు కనుమరుగు కావటం, కొందరు ఉద్యోగాలను కోల్పోవాల్సి రావటం సహజమైన ప్రక్రియగా పేర్కొన్నారు. రానున్న కాలంలో అనేక టెక్ కంపెనీలు కూడా ఇదే తరహాలో ఏఐని వినియోగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తోున్నాయి.
More From GoodReturns

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications