చైనాకు అమెరికా కంపెనీల షాక్, ట్రంప్ సర్కార్ అండ: భారత్‌కు అద్భుత అవకాశం

కరోనా మహమ్మారి తర్వాత చైనాలోని అమెరికా కంపెనీలు ఇప్పుడు భారత్‌ను పెట్టుబడులకు గమ్యస్థానంగా చూస్తున్నాయి. వీరికి అమెరికా విదేశాంగ శాఖ కూడా మద్దతిస్తోంది. ఇప్పటి వరకుచైనా కేంద్రంగా జరిగిన కార్యకలాపాలను భారత్ తరలిస్తే బాగుంటుందని అమెరికా బహుళజాతి కంపెనీలు భావిస్తున్నాయి. తమ పెట్టుబడులకు భారత్ అత్యంత అనుకూలమైనదిగా భావిస్తున్నాయి. గత వారం అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ స్టేట్, భారత్‌లోని దిగ్గజ అమెరికా కంపెనీల ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశంలో ఈ అభిప్రాయం వ్యక్తమైంది.

భారత్ వైపు నడుద్దాం

భారత్ వైపు నడుద్దాం

భారత్ ప్రాధాన్యత గురించి, చైనా నుండి ఇండియాకు కంపెనీల కార్యకలాపాల తరలింపు అవశ్యకతను గురించి సభ్యులు చర్చించారు. ప్రస్తుతం చైనా కేంద్రంగా నడుస్తోన్న పారిశ్రామిక కార్యకలాపాలను భారత్‌కు తరలించవచ్చునని డిపార్టుమెంట్ ఆఫ్ స్టేట్ దక్షిణాసియా వ్యవహారాల అసిస్టెంట్ సెక్రటరీ థామస్ అన్నారు. భారత ప్రభుత్వాన్ని అవసరమైన ప్రోత్సాహకాలు కోరాలని కూడా ఈ కంపెనీలు నిర్ణయించాయట. అదే దారిలో మరిన్ని కంపెనీలు నడిచే అవకాశముందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.

చైనాకు ప్రత్యామ్నాయం

చైనాకు ప్రత్యామ్నాయం

కరోనా పుట్టిన చైనా నుండి వివిధ దేశాల కంపెనీలు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నాయి. కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అక్కడి విదేశీ సంస్థలు తమ కర్మాగారాలను క్లోజ్ చేసే పరిస్థితి. దీంతో ఆయా దేశాలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ వైపు చూస్తున్నాయి. ఇందులో భాగంగా అమెరికా కంపెనీలు.. చైనా నుండి భారత్ తరలించడం మంచిదిగా భావిస్తున్నాయి. దీనికి ట్రంప్ సర్కార్ మద్దతు ఉండటం గమనార్హం.

భారత్‌కు అద్భుత అవకాశం

భారత్‌కు అద్భుత అవకాశం

ప్రస్తుతం చైనాలో జరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలకు భారత్ త్వరగా అనుకూలమైనదిగా మారగలదని అమెరికా విదేశాంగ శాఖలో దక్షిణాసియా దేసాల అసిస్టెంట్ కార్యదర్శి థామస్ విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు కంపెనీలు తరలి వచ్చేందుకు సహాయపడతాయని అంటున్నారు. చైనా నుండి తరలి వెళ్లే సంస్థలు సహా విదేశాల నుండి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది భారత్‌కు సరైన సమయమని, అందుకు తగిన విధంగా వ్యూహాలను రూపొందించుకోవాల్సి ఉందని చెబుతున్నారు. ప్రోత్సాహకాలు, వేగవంతమైన అనుమతుల విషయమై దృష్టి సారించాలని చెబుతున్నారు.

అవకాశాలు అందిపుచ్చుకోవాలి

అవకాశాలు అందిపుచ్చుకోవాలి

అమెరికా సంస్థల విస్తరణకు అనుగుణంగా ఇండియా ప్రోత్సాహకాలు ఇవ్వాలని కంపెనీలు కోరుతున్నాయి. అప్పుడే చాలా సంస్థలు వస్తాయని చెబుతున్నారు. ఈ మేరకు మోడీ ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయా సంస్థలు ట్రంప్ సర్కారును కోరుతున్నాయట. కాగా, కరోనా కారణంగా చైనాకు వాటిల్లే నష్టం భారత్‌కు లాభించగలదని, దేశంలో ఎలక్ట్రానిక్ తయారీని ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు. చైనా నుండి కంపెనీలు వెళ్లిపోవాలని చూస్తున్నాయని, ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోవాలంటున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+