ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోను బుధవారం ప్రపంచం క్లీన్ టెల్కోస్ జాబితాలో చేర్చారు అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో. చైనా దిగ్గజం హువావే టెక్నాలజీస్ కంపెనీ లిమిటెడ్ (హువావే) వ్యాపారాన్ని నిరాకరించిన నేపథ్యంలో ఈ జాబితాలో చేర్చారు. ఈ మేరకు పాంపియో నిన్న ట్వీట్ చేశారు. ప్రపంచ దిగ్గజ టెలికం కంపెనీలు టెలెఫోనికా, ఆరెంజ్, జియో, టెల్స్ట్రా తదితర కంపెనీలు క్లీన్ టెల్కోస్ అవుతున్నాయని, హువావేకు దూరం జరుగుతున్నాయని, తద్వారా హువావే లాంటి సీసీపీ(కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా) నిఘా సాధనాలతో వ్యాపారం చేయడానికి నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. హువావేను చైనా సైనిక నియంత్రణలో ఉన్న టెల్కోగా పేర్కొన్నారు.

అందుకే జియోకు క్లీన్ చిట్
అమెరికా విదేశాంగ కార్యదర్శి కొంతకాలంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీపై, చైనా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రతాపరమైన ఆందోళనతో చైనాకు చెందిన హువావేపై ఆంక్షలు కూడా విధించారు. ఈ నేపథ్యంలో హువావేతో వ్యాపారానికి నిరాకరించింది. హువావే ఎక్విప్మెంట్స్కు నో చెప్పింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియోను క్లీన్ టెల్కోగా పేర్కొన్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ లేబుల్ అయిన హువావే విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది అమెరికా. జియోతో పాటు కెనడా, బ్రిటిష్, ఫ్రెంచ్ టెలికం సంస్థలు కూడా హువావే పరికరాలకు దూరం జరుగుతున్నాయని పాంపియో చెప్పారు. సీసీపీ నిఘా నేపథ్యంలో హువావే వంటి కంపెనీలతో బిజినెస్ను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు.

పరీక్షల కోసం జియో..
ప్రపంచంలో చైనీస్ కాంపోనెంట్ లేనిది కేవలం జియో మాత్రమేనని ఫిబ్రవరిలో ఇండియా వచ్చిన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్తో ముఖేష్ అంబానీ చెప్పారు. జియో 5జీ కోసం స్వదేశీ మార్గాన్ని ఎంచుకుంటోంది. థర్ట్ పార్టీ భాగస్వామ్యం లేకుండా సాంకేతిక పరిజ్ఞానం కోసం పరీక్షలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని కూడా డిపార్టుమెంట్ ఆఫ్ టెలికం (DoT)కి దరఖాస్తు చేసుకుంది.

పౌరుల భద్రత
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా దేశాల మధ్య గత కొన్నేళ్లుగా సంబంధాలు క్షీణించాయి. ఒకరిపై మరొకరు అధిక సుంకాలు విధించుకుంటున్నారు. ఇదే సమయంలో అమెరికాతో సహా పలు యూరోపియన్ దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు హువావే వంటి చైనా కంపెనీలపై భద్రతా సమస్య లేవనెత్తాయి. 5జీ టెక్నాలజీలో చైనా ముందుంది. చైనా కంపెనీలు తయారు చేసే పరికరాలను ఆమోదిస్తే తమ పౌరుల డేటాకు భద్రత ఉండదని భావిస్తున్నాయి. భారత్లోను హువావే 5జీ వేలం కోసం నిరాకరించని పరిస్థితుల్లో, ఈ చైనా కంపెనీ పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి.

ఫేస్బుక్-జియో డీల్కు ఓకే
మరోవైపు, రిలయన్స్ జియోలో రూ.43,574 పెట్టుబడి ద్వారా ఫేస్బుక్ 9.99 శాతం వాటాను దక్కించుకున్న విషయం తెలిసిందే. దీనికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆమోద ముద్ర లభించింది. జియోకు 388 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఫేస్బుక్ - జియో డీల్ ఏప్రిల్ 22న కుదిరింది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధం వేళ అమెరికాను చావు దెబ్బ కొట్టిన చైనా.. బుల్లెట్ పేల్చకుండానే అగ్రరాజ్యంపై కొత్త వార్..

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

Oil prices: జపాన్ రహస్య ఆయిల్ నిధి! ఆరు నెలలకు సరిపడా చమురుని జపాన్ ఎలా దాచిపెట్టింది?

యుద్దం ఆపడం మా చేతుల్లో ఉంది.. నీ చేతుల్లో కాదు.. ట్రంప్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ విసిరిన ఇరాన్..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం.. ధరల పెరుగుదలతో పలు దేశాలు విలవిల..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

Iran war: ఇరాన్లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ఏం జరుగుతోంది?



Click it and Unblock the Notifications