షట్డౌన్తో కుప్పకూలిన అమెరికా ఆర్థిక వ్యవస్థ.. డబ్బులు లేక వ్యాపారులు విలవిల
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా అక్టోబర్ 1 నుండి షట్డౌన్లో ఉంది. సమీప భవిష్యత్తులో దీని ముగింపు సూచనలు కనిపించడం లేదు. ఈ షట్డౌన్ వల్ల ప్రధానంగా చిన్న వ్యాపారాలు, రెస్టారెంట్లు, ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభావితులయ్యారు. చిన్న వ్యాపారాలు పన్ను క్రెడిట్లను పొందలేకపోవడంతో వారి ఆర్థిక పరిస్థితి కుదించబడుతోంది. లక్షలాది మంది ఫెడరల్ ఉద్యోగులు జీతాలు అందుకోలేకపోతున్నందున, వారు పొదుపులను ఖర్చు చేయకుండా నిలిచిపోతున్నారు.
ఇప్పటికే అమెరికా ఫెడరల్ ప్రభుత్వ అప్పు 38 ట్రిలియన్ డాలర్లకు చేరిన సందర్భంలో.. ఈ షట్డౌన్ మరింత సంక్లిష్టతను సృష్టిస్తుంది. రుణాలు ఇవ్వడం, పన్ను క్రెడిట్ ప్రాసెసింగ్, ఇతర ముఖ్యమైన ప్రభుత్వ విధులు నిలిపివేయబడ్డాయి. దీని ప్రభావం ఉద్యోగాలు, పెట్టుబడులు, వినియోగంపై వెంటనే కనిపిస్తోంది. షట్డౌన్ ఎక్కువకాలం కొనసాగితే, కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి ఉద్యోగులను తొలగించవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

ప్రజల ఖర్చు తగ్గడం అనేది వ్యాపారాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ప్రజలు బయట భోజనం చేయడం తగ్గించడంతో రెస్టారెంట్ల ఆదాయం కోతకు లోనయ్యింది. కరోనా మహమ్మారి కారణంగా అనేక వ్యాపారాలు కోలుకోవడానికి నెలల నుంచి సంవత్సరాల వరకు సమయం పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షట్డౌన్ వారి పరిస్థితిని మరింత దిగజార్చింది.
అమెరికాలో షట్డౌన్ ఎందుకు జరిగింది అంటే..ప్రభుత్వానికి ఖర్చుల కోసం నిధులు అవసరం. US ప్రతినిధుల సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అయితే కాంగ్రెస్ ఆమోదించలేదు. ఫలితంగా అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా షట్డౌన్ విధించబడింది. గతంలో US చరిత్రలోనే అతి పొడవైన షట్డౌన్ డిసెంబర్ 22, 2018న ప్రారంభమై జనవరి 25, 2019 వరకు 35 రోజుల పాటు కొనసాగింది. దీని వల్ల ఆర్థిక వ్యవస్థకు 3 బిలియన్ డాలర్ల నష్టం ఏర్పడింది.
ఏదేమైనా Shutdown తాత్కాలిక ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది.అయితే దీని పరిష్కారం త్వరగా ముగియాలి. ప్రభుత్వానికి ఖర్చుల నిధులను సేకరించడం, ఉద్యోగులకు జీతాలను పునరుద్ధరించడం, చిన్న వ్యాపారాలను పునరుజ్జీవితం చేయడం కీలకం. ఆర్థిక నిపుణులు, పెట్టుబడిదారులు, మార్కెట్ వినియోగదారులు ఈ పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు, షట్డౌన్ ఎంత కాలం కొనసాగుతుందో, దీని పూర్తి ప్రభావం ఎంత ఉంటుందో అనేది వచ్చే వారాలలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అమెరికా-చైనా మధ్య సాంకేతిక ఉద్రిక్తతలు మరలా పెరుగుతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అరుదైన భూమి ఖనిజాల ఎగుమతులపై బీజింగ్ ఇటీవల విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు వ్యతిరేకంగా మరో రీ ఎగుమతి నియంత్రణ ప్రణాళికను పరిశీలిస్తున్నారని బ్లూమ్బెర్గ్ నివేదించింది. ఈ చర్య అమల్లోకి వస్తే, ప్రపంచ టెక్ సరఫరా గొలుసుపై దాని ప్రభావం విపరీతంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications