Finance Jobs: అమెరికాలో కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాకతో ప్రస్తుతం జాబ్ మార్కెట్లో అనేక మార్పులు రాబోతున్నాయి. అనేక కంపెనీలు తమకు అవసరమైన నిపుణులను నేరుగా రిక్రూట్ చేసుకునేందుకు హెచ్1బి వీసాల పరిమితి ప్రభావాలు ఉన్నందున కొత్త మార్గాన్ని అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా సంస్థలు తమ అవసరాలను తీర్చుకునేందుకు ఇతర దేశాల్లో ఆఫీసుల విస్తరణ ప్రణాళికతో ముందుకు వస్తున్నాయి.
ఈ క్రమంలో అమెరికాకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ బ్లాక్రాక్ తన వ్యాపారాన్ని ఇండియా కేంద్రంగా విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఏఐ సామర్థ్యాలను భారతదేశంలో విస్తరించాలని ప్లాన్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ మేనేజర్ ఇందులో భాగంగా ముంబై, న్యూఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్లలో తన iHub కేంద్రాల కోసం నియామకాలు చేపడుతోంది. ప్రస్తుత నియామకాలతో కంపెనీ భారతీయ ఉద్యోగుల సంఖ్య 3,500కి పెరుగుతుందని వెల్లడైంది.

ప్రస్తుతం కంపెనీ విస్తరణ కారణంగా ఎక్కువ మంది డేటా సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు కలిగి ఉంటారని వెల్లడైంది. ఇదే క్రమంలో కంపెనీ బెంగళూరు ఐటీ హబ్ లో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్ కోసం కూడా ఉద్యోగుల నియామకాన్ని కొనసాగిస్తోంది. బెంగళూరులో దాదాపు 1500 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి రాయిటర్స్ నివేదికపై ఇప్పటి వరకు బ్లాక్రాక్ నేరుగా స్పందించలేదు.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం గురుగ్రామ్, ముంబై సపోర్ట్ సెంటర్ల కోసం కంపెనీ ప్రస్తుతం 1200 మంది ఉద్యోగులను కొత్తగా రిక్రూట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అంబానీతో వ్యాపారం..
ముఖేష్ అంబానీ ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ సంస్థతో ఇండియాలో పెట్టుబడుల వ్యాపారం కోసం ఇప్పటికే జతకట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జియో ఫైనాన్షియల్ రెండు కంపెనీల్లో 50% వాటా కోసం రూ.82.9 కోట్లు పెట్టుబడి పెట్టింది. అంటే జియో బ్లాక్రాక్ అసెట్ మేనేజ్మెంట్ కోసం రూ.82.5 కోట్లు కాగా జియో బ్లాక్రాక్ ట్రస్టీకి రూ.40 లక్షలు పెట్టుబడిగా పెట్టింది. భారతీయ రెగ్యులేటరీల నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఈ రెండు కంపెనీలు మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలో ముందుకు సాగాలని నిర్ణయించాయి.
జియో బ్లాక్రాక్ సంస్థ అమెరికా దిగ్గజాన్ని పెట్టుబడి నిర్వహణ, రిస్క్ మేనేజ్మెంట్, సాంకేతికతలో నైపుణ్యాన్ని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్థానిక మార్కెట్ పరిజ్ఞానం, డిజిటల్ మౌలిక సదుపాయాలతో మిళితం చేస్తుంది.
More From GoodReturns

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications