Bank Jobs: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు పొందేందుకు అనేక మంది యువత కలలు కంటుంటారు. బ్యాంకులు ఖాళీల భర్తీకి ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తాయా అని కోటి ఆశలతో ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్ చెప్పబోతోంది. పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ప్రతినెలా రిక్రూట్మెంట్..
ఈ సమావేశంలో బ్యాంకుల్లోని ఉద్యోగుల సంఖ్యను సమీక్షించి.. నెలవారీ రిక్రూట్ మెంట్ ప్లాన్ తీసుకురానున్నట్లు సమాచారం. గడచిన 10 సంవత్సరాల్లో బ్యాంకుల సంఖ్య 28 శాతం పెరిగినప్పటికీ ఉద్యోగుల సంఖ్య మాత్రం అంత వేగంగా పెరగలేదు. బ్యాంక్ బ్రాంచ్ ల స్థాయిలో ఉద్యోగుల కొరత ఎక్కువగా ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ సమావేశం తర్వాత సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు.

గ్రామాల్లో అధిక డిమాండ్..
ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఎక్కువ శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం, వాటికి అనేక పనులపై ప్రజలు నేరుగా రావటం మనం చూస్తూనే ఉంటాం. పట్టణ ప్రాంతాల్లో కూడా ఫిజికల్ గా బ్యాంకులకు వెళ్తుంటారు. సైబర్ మోసాల కారణంగా చాలా మంది ఇప్పుడు నేరుగా బ్యాంకులకు వెళ్లి పనులు పూర్తి చేసుకునేందుకే ఇష్టపడటం బాగా పెరగటం వల్ల కూడా సిబ్బంది అవసరం పెరుగుతోంది. ముఖ్యంగా క్లరికల్ స్థాయిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది.

పెరిగిన శాఖలు.. తగ్గిన సిబ్బంది..
గత పదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖల సంఖ్య 28 శాతం పెరగగా.. సిబ్బంది సంఖ్య మాత్రం తగ్గింది. డిజిటలైజేషన్ పెరగటంతో క్లెరికల్ సిబ్బంది సంఖ్యను తగ్గించడానికి దారితీసింది. మార్చి 2021 నాటికి దేశవ్యాప్తంగా 86,311 శాఖలు ఉండగా.. 1.4 లక్షల ఏటీఎంలు ఉన్నాయి. ఆర్బీఐ లెక్కల ప్రకారం 2010-11లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగుల సంఖ్య 7.76 లక్షలు కాగా, అది 2020-21 నాటికి 7.71 లక్షలకు తగ్గింది. దీనికి క్లర్క్లు, జూనియర్ సిబ్బంది నియామకాలు తగ్గటం కూడా కారణంగా నిలుస్తోంది.

10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు..
ఉపాధి పెంపుపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్న తరుణంలో.. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ చర్య తీసుకుంటోంది. డిసెంబర్ 2023 నాటికి 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ప్రతి శాఖ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కోరారు. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్థానిక భాషపై అవగాహన ఉన్న వ్యక్తులకు బ్యాంకుల్లో ముందు డెస్క్ను నిర్వహించే బాధ్యత ఇవ్వాలని అన్నారు. ఈ క్రమంలో కొత్త కొలువులపై యువత ఎక్కువ ఆసక్తితో ఉన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications