ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2021 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పీటీఐ ప్రకారం బడ్జెట్ సెషన్స్ జనవరి 29న ప్రారంభమై, ఫిబ్రవరి 15న ముగుస్తాయి. కేంద్ర ఆర్థికమంత్రి ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను సభకు సమర్పిస్తారు. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 8న ప్రారంభమై, ఏప్రిల్ 8న ముగుస్తాయి.

బడ్జెట్‌కు సంబంధించిన మరిన్ని కథనాలు

సెషన్స్ సమయంలో ఉభయ సభలు ప్రతి రోజు నాలుగు గంటలు ఉంటాయి. నూతన రైతు చట్టాలపై పలు ప్రాంతాల్లో ఆందోళనలు సాగుతున్న సమయంలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ప్రతిపక్షాలు కూడా ఈ ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నాయి. బడ్జెట్‌కు సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది.

 Union Budget to be Presented on February 1

నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్‌కు సంబంధించి ప్రీ-బడ్జెట్ సంప్రదింపుల్లో భాగంగా డిసెంబర్ 14వ తేదీ నుండి పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. గత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా తుడిచిపెట్టుకు పోయింది. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి కీలక సంస్కరణలు, వివిధ రంగాల్లోని నిపుణుల సూచనలు అవసరం. ప్రభుత్వం, పరిశ్రమ ఏకతాటి పైకి వచ్చి ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో తదుపరి బడ్జెట్ కోసం నిర్మల సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+