న్యూఢిల్లీ: దాదాపు సగం మంది పట్టణవాసులు దేశంలోని నిరుద్యోగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం భారత్ సరైన దిశలో వెళ్తోందని వారు అభిప్రాయపడ్డారు. ఏకంగా 69 శాతం మంది అర్బన్ ఇండియన్స్ ఇండియా రైట్ డైరెక్షన్లో వెళ్తోందని చెబుతున్నారు. తద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం భావి భారత నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నంగా చాలామంది భావిస్తున్నట్లుగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ఇప్పోస్ తాజా సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

నిరుద్యోగం అసలు సమస్య
నిరుద్యోగ సమస్యపై దాదాపు సగం మంది ఆందోళనతో ఉన్నారు. దీంతో పాటు భారతీయులకు ఆందోళన కలిగిస్తున్న ఇతర అంశాల్లో ఆర్థిక అవినీతి, పొలిటికల్ కరప్షన్, నేరాలు, హింస, పేదరికం, అసమానతల, వాతావరణ మార్పులు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని, అలాగే భారత్ను కలవరపెడుతున్న అంశాలపై ఇప్పోస్ ఈ సర్వే నిర్వహించింది.

భారత్ సరైన దారిలోనే వెళ్తోందని 69 శాతం మంది
ఓ వైపు నిరుద్యోగం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, భారత్ మాత్రం సరైన దిశలో ముందుకు సాగుతోందని ఎంతోమంది అభిప్రాయపడ్డారు. 69 శాతం మంది అర్బన్ ఇండియన్స్ భారత్ సరైన దారిలో వెళ్తోందని చెప్పగా, ప్రపంచంలో ఇది కేవలం 61 శాతం మాత్రమే. అంటే అన్ని దేశాలతో పోలిస్తే ఇండియాలోనే 8 శాతం మంది ఎక్కువగా అద్భుతమైన భావి భారత్ దిశగా వెళ్తోందని అభిప్రాయపడ్డారు.

నిరుద్యోగంపై 46 శాతం మంది ఆందోళన
నిరుద్యోగం ఆందోళన కలిగించే అంశమని 46 శాతం మంది చెప్పారు. ఈ సర్వేను అక్టోబర్ నెలలో నిర్వహించారు. నవంబర్ నెలలో నిరుద్యోగం మరో 3 శాతం పెరిగింది. నిరుద్యోగంతో పాటు పేదరికం, సామాజిక అసమానతలపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత నేరాలు, హింస, ఆర్థిక, రాజకీయ అవినీతి ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా సామాజిక అసమానత, పేదరికం ఆందోళనకరం
28 దేశాల్లో ఇప్సోస్ ఆన్ లైన్ ప్యానెల్ సిస్టం ద్వారా సర్వే నిర్వహించింది. కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేదరికం, సామాజిక అసమానతలే ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఆ తర్వాత నిరుద్యోగం, నేరాలు, హింస, రాజకీయ, ఆర్థిక కరప్షన్, హెల్త్ కేర్ ఉన్నాయి.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications