కేంద్ర ప్రభుత్వం, సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ మధ్య వార్ నడుస్తోంది. కొన్ని ట్విట్టర్ ఖాతాలను తొలగించాలన్న ఆదేశాలపై ట్విట్టర్ వివరణపై ఐటీ శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖలిస్తాన్, పాకిస్తాన్ లింక్స్ కలిగిన 1,178 ఖాతాలను రద్దు చేయాలని కేంద్రం హెచ్చరించింది. దీంతో ట్విట్టర్ దాదాపు 500 ఖాతాలు తొలగించింది. అయితే ప్రభుత్వం ఆదేశాలు చట్ట విరుద్ధమని, భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతమని ఓ బ్లాగ్ పోస్టులో పేర్కొంది. దీనిపై ఐటీ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చలకు ముందు ఇది సరికాదని తెలిపింది.

అందుకే కేంద్రం ఆగ్రహం
పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో రైతుల నిరసన నేపథ్యంలో ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తిచేస్తోన్న 257 మంది ట్విట్టర్ ఖాతాలను నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. ఆ ఖాతాలను నలిపివేసిన కొద్ది గంటలకు తిరిగి పునరుద్ధరించింది. దీనిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం ఈ నెల 4న 1,178 ఖాతాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. రైతుల నిరసనపై తప్పుడు సమాచారం, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

500 ఖాతాల నిలిపివేత
కేంద్రం ఆదేశాలకు ట్విట్టర్ పాక్షికంగానే మద్దతు ఇచ్చింది. 1100కు పైగా ఖాతాలు నిలిపిపివేయాలని ఆదేశించగా, 500 ఖాతాలను మాత్రమే నియంత్రించింది. ఇందుకు సంబంధించిన వివరాలను బ్లాగ్ పోస్టులో ట్విట్టర్ తెలిపింది. వార్తా సంస్థలు, జర్నలిస్ట్స్, కార్యకర్తలు, రాజకీయ నాయకుల ఖాతాలను నిలిపివేయలేదని వెల్లడించింది. ఈ ఖాతాలు నిలిపివేస్తే భావ వ్యక్తీకరణ హక్కును ఉల్లంఘించినట్లవుతుందన పేర్కొంది.

'కూ'లో ప్రభుత్వం స్పందన
ట్విట్టర్ తీరుపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖాతాల నిలిపివేతపై చర్చించే అవకాశం కల్పించాలని ట్విట్టర్ కోరిందని, ఐటీ శాఖ అధికారులు సమావేశమయ్యేందుకు అంగీకరించారని, అంతలోపే ట్విట్టర్ బ్లాగ్ పోస్టులో తన వాదనను ప్రచురించడం సరికాదని కేంద్రం పేర్కొంది. మరో స్వదేశీ సామాజిక మాధ్యమం 'కూ'లో ప్రభుత్వం స్పందించింది.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications