ట్రంప్ ట్యారిఫ్ వల్ల మన భారత్‌కి ఇది ఒక బంపర్ ఆఫర్

ట్రంప్ విధించిన 50% సుంకాలు భారత ఎగుమతులకు పెద్ద దెబ్బ అయినా, ఇది కేవలం ఒక తాత్కాలిక సమస్య మాత్రమే. ఇప్పుడు సరైన ఆర్థిక నిర్ణయాలతో, ఈ సవాలు భారత్‌కు కొత్త అవకాశాలకి తలుపులు తెరవాలి. కష్టాన్ని గెలుపుగా మార్చుకోవడం మన చేతిలో ఉంది. భారత్ ముందున్న దారి స్పష్టంగా ఉంది. పన్నులు తగ్గించి, పెట్టుబడులను ఆకర్షించి, ప్రపంచ మార్కెట్లో గెలుపు సాధించాలి.

AI 6G Trump tariffs Indian exports rupee value middle-class purchasing power rural markets direct cash transfer job creation foreign investment defence sector AI blockchain 6G research institutions Make in India

డొనాల్డ్ ట్రంప్ "అమెరికా ఫస్ట్" పేరుతో తీసుకున్న 50% భారీ దిగుమతి సుంకాలు, భారత్ ఎగుమతుల గుండెపై నేరుగా దెబ్బతీశాయి. అమెరికాకు భారత్ నుంచి వెళ్ళే ముఖ్య ఉత్పత్తులు ఫార్మాస్యూటికల్స్ (రూ 1 లక్ష కోట్లు పైగా), టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోలు అన్నీ ఈ సుంకాల వల్ల దెబ్బ తింటాయి. దీంతో GDPలో 0.5% వరకు తగ్గుదల ఉండొచ్చని అంచనాలు. రూపాయి విలువ 87.95/$ వద్ద కుదేలవుతుండటంతో, 40 కోట్ల మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతోంది.

కానీ ఈ ఆర్థిక తుఫాన్‌లోనే భారత్ తన ఆర్థిక మోడల్‌ను మార్చుకోవచ్చు.ఇప్పటివరకు సరుకు ఉత్పత్తి పెంచితే డిమాండ్ పెరుగుతుందని భావించారు, కానీ అది పెద్దగా పనిచేయదు. ఇప్పుడు డిమాండ్‌ను నేరుగా పెంచే విధానాన్ని అనుసరించాలి.

ప్రస్తుతం రూ. 15 లక్షల కంటే ఎక్కువ సంపాదించే వారి ఆదాయంపై 30-40% పన్ను వసూలవుతుంది. దీన్నిరూ.15 లక్షల లోపు ఉన్నవారి ఆదాయాల కోసం 15%కి తగ్గిస్తే, మధ్యతరగతి చేతిలో 12-15% అదనపు డబ్బు మిగులుతుంది. దీని వల్ల రూ.4 లక్షల కోట్ల అదనపు ఖర్చు మార్కెట్లో వస్తుందని నీతి అయోగ అంచనా వేస్తుంది.

గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు నగరాల కంటే నెమ్మదిగా పెరుగుతోంది. దీన్ని మార్చడానికి ప్రభుత్వ పథకాల ద్వారా నేరుగా డబ్బు ఇవ్వాలి. PM గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 10 కోట్ల గ్రామీణ కుటుంబాలకు నెలకు రూ.5,000 ఇస్తే, గ్రామీణ మార్కెట్లు చురుకవుతాయి, అప్పుడు GDP 0.5% పెరుగుతుంది.

ఇప్పుడు ఉద్యోగాలు సృష్టించడం అత్యవసరం. రక్షణ, గ్రామీణ మౌలిక వసతులు, రవాణా రంగాల్లో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించి, టెక్నాలజీని తప్పనిసరి చేస్తే, వచ్చే సంవత్సరాల్లో లక్షల ఉద్యోగాలు వస్తాయి. రక్షణ రంగం ఒక్కటే 2030 నాటికి సుమారు 1.2 మిలియన్ ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం కలిగిఉంది. డిఫెన్స్, రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సానిటేషన్, వాటర్ కన్జర్వేషన్, రోడ్ల రంగాల్లో 100% విదేశీ పెట్టుబడులు అనుమతిస్తూ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ తప్పనిసరి చేస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయి. రోడ్ల రంగం ఒక్కటే రూ.41 లక్షల కోట్ల పెట్టుబడి అవసరం.

H-1B వీసా కఠినం చెయ్యడంతో IT రంగానికి ప్రమాదం ఉన్నా, భారత్‌ లోపలే AI, బ్లాక్‌చైన్, 6G రంగాల్లో పెట్టుబడులు పెడితే లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చు. కంపెనీలు తమ ఆదాయంలో కనీసం 2% R&Dకి కేటాయించాలి. ఇలా చేస్తే కొత్త టెక్నాలజీలు దేశంలోనే అభివృద్ధి అవుతాయి, దిగుమతులపై ఆధారం తగ్గుతుంది. అంతేకాక, స్థానిక ప్రతిభకు మంచి అవకాశాలు దొరుకుతాయి. దీని వల్ల భారత్ టెక్నాలజీ రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి చేరవచ్చు.

ఇప్పుడూ ఉన్న GSTని 5% మరియు 15% రెండు స్లాబ్లకు కుదిస్తే ఉత్పత్తి ఖర్చులు 20% తగ్గుతాయి. చైనాతో పోలిస్తే మన కార్మిక ఖర్చులు 30% తక్కువగా ఉండటం 'మేక్ ఇన్ ఇండియా'కి సహాయం చేస్తుంది. BRICS దేశాల మధ్య లోకల్ కరెన్సీ ట్రేడ్ పెంచి, US డాలర్‌పై ఆధారాన్ని తగ్గించాలి. దీనివల్ల సుంకాలు, ఆంక్షల ప్రభావం తగ్గుతుంది. అమెరికా కంపెనీల బదులు, భారతీయ పరిశోధనా సంస్థలను బలపరచి, మన దేశ పరిస్థితులకు తగ్గ సలహాలు ఇవ్వాలి. ఉదాహరణకి భూమి రికార్డులను బ్లాక్‌చైన్‌తో డిజిటల్ చేయడం వల్ల సంవత్సరానికి రూ.40,000 కోట్లు ఆదా అవుతుంది.

ట్రంప్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలు అమెరికాకు తాత్కాలిక లాభం ఇవ్వొచ్చు, కానీ భారత్ దీన్ని చాకచక్యంగా ఉపయోగించుకుంటే దీర్ఘకాల విజయం సాధించవచ్చు. పన్నులు తగ్గించడం, పెట్టుబడులకు తలుపులు విప్పడం, టెక్నాలజీని ఆయుధంగా మలచడం ద్వారా భారత్ చైనాతో సమానంగా ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+