For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Yatra Online IPO: రూ.750 కోట్లు టార్గెట్

|

ముంబై: దేశీయ లీడింగ్ ట్రావెల్ సర్వీస్ ప్రొవైడర్ యాత్ర ఆన్‌లైన్ లిమిటెడ్.. త్వరలో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (Yatra Online IPO)కు రానుంది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌ను సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)కి సమర్పించింది. 93 లక్షలకు పైగా ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్‌కు పెట్టింది. యాత్ర ఆన్‌లైన్ లిమిటెడ్ మాతృసంస్థ యాత్ర ఆన్‌లైన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్.. ఇదివరకే అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్ నాస్డాక్‌లో లిస్టింగ్ అయింది.

సీఎన్జీపై సర్కార్ సంచలన నిర్ణయం: సగానికి పైగా వ్యాట్ తగ్గింపుసీఎన్జీపై సర్కార్ సంచలన నిర్ణయం: సగానికి పైగా వ్యాట్ తగ్గింపు

పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా 750 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలని యాత్ర ఆన్‌లైన్ లిమిటెడ్ నిర్ణయించింది. ఈ మొత్తాన్ని జనరల్ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించుకుంటామని కంపెనీ తెలిపింది. ఈ విషయాన్ని సెబికి అందజేసిన డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌లో పొందుపరిచింది. వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టడం, ఇతర ట్రావెల్ సర్వీస్ ప్రొవైడర్లను టేకోవర్ చేయడం, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి ఖర్చు చేస్తామని పేర్కొంది.

Travel services provider Yatra Online has filed draft papers with Sebi for an IPO worth up to Rs 750 Cr

ఆఫర్ ఫర్ సేల్ కింద పెట్టిన ఈక్విటీల మొత్తం 93,28,358. ఇందులో 88,96,998 షేర్లను టీహెచ్‌సీఎల్ ట్రావెల్ హోల్డింగ్స్ సైప్రస్ లిమిటెడ్, 4,31,360 షేర్లను పండారా ట్రస్ట్ స్కీమ్‌కు కేటాయిస్తుంది. ట్రస్టీ విస్టా ఐటీసీఎల్ (ఇండియా) లిమిటెడ్‌కు అనుబంధ సంస్థ ఇది. కాగా- యాత్ర ఆన్‌లైన్ ఐపీఓ వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి ఎస్బీఐ కేపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, డీఏఎం కేపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌ అపాయింట్ అయ్యారు.

కాగా- వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంటే ఏప్రిల్-మే-జూన్ మధ్యకాలంలో ఈ కంపెనీ ఐపీఓ జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. సెబి అనుమతి లభించిన వెంటనే- ప్రైస్ బ్యాండ్‌, లాట్‌ను నిర్ధారిస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం పూర్తిగా తగ్గిన తరువాత ఆన్‌లైన్ ట్రావెల్ సర్వీస్ ప్రొవైడర్లకు మళ్లీ గిరాకీ పెరిగింది. ఇదివరకు ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోండటాన్ని దృష్టిలో ఉంచుకుని వెనక్కి వెళ్లిన గో ఎయిర్ వంటి సంస్థలు కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పబ్లిక్ ఇష్యూను జారీ చేయొచ్చని తెలుస్తోంది.

English summary

Yatra Online IPO: రూ.750 కోట్లు టార్గెట్ | Travel services provider Yatra Online has filed draft papers with Sebi for an IPO worth up to Rs 750 Cr

Leading travel services provider Yatra Online Ltd has filed draft papers with markets regulator Sebi for an initial public offering that includes fresh issue of shares worth up to Rs 750 crore.
Story first published: Saturday, March 26, 2022, 16:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X