అమెరికాకు తొలిరోజే దిమ్మతిరిగే షాకిచ్చిన భారత్..ఏకంగా రూ. 31 వేల కోట్లకు పైగా డీల్ రద్దు

భారత్-అమెరికా మధ్య వాణిజ్య వార్ మొదలైంది. ట్రంప్ 50 శాతం సుంకాలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు భారత దేశం రష్యాతో వ్యాపార సంబంధాలు నిలిపివేయాలని కోరుతున్నాడు. ఆ దేశం నుంచి చమురు కొనుగోలుపై తీవ్ర అభ్యంతరం చెబుతున్నాడు. దీనిని ఇండియా ఖండిస్తోంది. పశ్చిమదేశాలు కూడా చమురును కొనుగోలు చేస్తున్నాయని... దౌత్య సంబంధాల పరంగానే అంతర్జాతీయ ఆంక్షలకు లోబడి చమురు కొనుగోలు చేస్తున్నామని అమెరికాకు తేల్చి చెప్పింది.

అయితే ట్రంప్ మాత్రం చమురు కొనుగోలు ఆపేయాలని పట్టుబడుతున్నారు. భారత్ మాట వినడం లేదని రూ. 50 శాతం సుంకాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. దేశ ప్రయోజనాల విషయలం రాజీ పడబోమని తేల్చి చెప్పింది. తాజాగా భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో ఉన్న కీలక రక్షణ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు విశ్వసనీయ సమాచారం.

India P-8I deal paused US tariffs on Russian oil India US defence tensions India countermeasures on US Modi halts Boeing deal India US trade war 2025 P-8I aircraft deal news Trump oil tariffs India reaction India military deal paused India retaliation US sanctions -8 - -8 2025 P-8I 31 500 P-8I Boeing

అమెరికన్ ఏరోస్పేస్ దిగ్గజం Boeing నుండి ఆరు P-8I పోసిడాన్ యాంటీ-సబ్‌మెరైన్ విమానాలు భారతదేశం కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ డీల్ మొత్తం విలువ సుమారుగా రూ. 31,500 కోట్లు (USD 3.78 బిలియన్లు). ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలభారత చమురు దిగుమతులపై 50% దిగుమతి సుంకం విధిస్తూ చేసిన బెదిరింపులే దీనికి కారణమని తెలుస్తోంది.

అమెరికా చర్యలను భారత్ అన్యాయమైనవిగా తెలిపింది. అమెరికా, యూరోపియన్ దేశాలు భారీగా రష్యా నుండి చమురు, ఎరువులు, గ్యాస్ కొనుగోలు చేస్తున్నాయని మండిపడింది. ద్వంద నీతికి అమెరికా పాల్పడుతోందని ఫైర్ అయింది. మీరు కొనుగోలు చేస్తే ఒప్పు..మేము కొనుగోలు చేస్తే తప్పు..ఇది అన్యాయాం కాదా అని CREA (సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్) నివేదికలలో తెలిపింది. ఈ ఉద్రిక్త పరిణామాల మధ్య.. భారత ప్రభుత్వం అమెరికాకు షాకిస్తూ.. ఆగస్టు 3, 2025న P-8I విమానాల కొనుగోలు ఒప్పందాన్ని నిలిపివేసినట్లు రక్షణ నిపుణుల వెబ్‌సైట్ IDRW వెల్లడించింది.

P-8I పోసిడాన్ విమానాలు భారత నావికాదళానికి కీలకమైన నిఘా సామర్థ్యాన్ని అందించేవిగా చెప్పుకోవచ్చు. హిందూ మహాసముద్రంలో చైనా సముద్ర శక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ విమానాల ద్వారా సబ్‌మెరైన్లు, నౌకలు, వ్యాపార నౌకలు వంటి పలు అంశాలపై నిఘా పెట్టడం ప్రధాన లక్ష్యంగా ఉంటుంది.భారత నావికాదళం 12 P-8I విమానాలను ఇప్పటికే వినియోగిస్తోంది. 2009లో 8 విమానాలను, 2016లో మరో 4 విమానాలను అమెరికా నుండి కొనుగోలు చేసింది. అమెరికా 2021లో మరో 6 విమానాల అమ్మకానికి అనుమతి ఇచ్చింది. అయితే ఖర్చు పెరిగి, ఒప్పందం ఆలస్యం కావడంతో ఆ లావాదేవీ అర్ధాంతరంగా నిలిచిపోయింది.

ఈ ఒప్పందం నిలిపివేతతో అమెరికన్ కంపెనీ బోయింగ్‌కు పెద్ద షాక్ తగిలినట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌లోనే దాదాపు 5 వేల ఉద్యోగాలు, రూ. 15 వేల కోట్ల మేర ఆర్థిక అంశాలతో ముడిపడిన ఈ ఒప్పందం నిలిపివేత కంపెనీ వ్యాపార లక్ష్యాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ స్వదేశీ సాంకేతికత వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. DRDO, HAL సంస్థలతో కలిపి స్వదేశీ విమానాల అభివృద్ధి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+