టైటాన్ కంపెనీ మార్చి త్రైమాసికంలో రూ.786 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని ఆర్జించింది. ఇది గత ఏడాది కాలంలో రూ.734 కోట్లతో పోలిస్తే 7 శాతం వృద్ధిని సాధించింది. ఆభరణాల వ్యాపారి, వాచ్మేకర్ ఆదాయం రూ.10,047 కోట్లకు చేరిందని ఫలితాల్లో ప్రకటించింది. ఇది గత ఏడాది త్రైమాసికంలో రూ.8,553 కోట్ల నుంచి 17 శాతం పెరిగిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది.
త్రైమాసికంలో వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచన (EBIDTA) ముందు ఆదాయాలు 6.2 శాతం వృద్ధితో రూ.1,109 కోట్లుగా ఉన్నాయి. EBITDA మార్జిన్లు 90 bps YoY నుంచి 9.9 శాతానికి తగ్గాయి. 40వ వార్షిక సాధారణ సమావేశం ముగిసిన తర్వాత, కంపెనీ షేర్హోల్డర్ల ఆమోదం పెండింగ్లో ఉన్న రూ. 1 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు రూ. 11 డివిడెండ్ చెల్లించాలని బోర్డు సిఫార్సు చేసింది.

టైటాన్ మొత్తం ఆదాయం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 19% పెరిగి దాదాపు రూ.8,998 కోట్లకు చేరుకుంది. ఈ సమయంలో భారతీయ వ్యాపారం ప్రత్యేకంగా 20 శాతం పెరిగింది. EBIT అంటే వడ్డీ, పన్నులకు ముందు ఆదాయాలు, త్రైమాసికంలో 12.1% మార్జిన్తో దాదాపు రూ. 1,089 కోట్లకు చేరింది. మొత్తం సంవత్సరం మొత్తంలో, కంపెనీ మొత్తం ఆదాయ వృద్ధి 20%, దాదాపు రూ. 38,353 కోట్లకు చేరుకున్నాయి.
తనిష్క్ దుబాయ్, యూఎస్ లోని చికాగోలో కొత్త దుకాణాలను ప్రారంభించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది ఈ కంపెనీ. టైటాన్ జ్యువెలరీ ఉనికిని ప్రపంచవ్యాప్తంగా 16 దుకాణాలకు పెంచింది. భారతదేశంలో తనిష్క్ త్రైమాసికంలో 11 కొత్త స్టోర్లను ప్రారంభించగా, మియా 16 కొత్త స్టోర్లను ఓపెన్ చేసింది. ఈ త్రైమాసికంలో వ్యాపారం దాదాపు 940 కోట్ల మొత్తం ఆదాయాన్ని సాధించింది. ఇది Q4FY23 నుండి 8% పెరుగుదలను సూచిస్తుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications