SBI: యెస్ బ్యాంకులో తన వాటాను విక్రయించిన ఎస్బీఐ..!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యెస్ బ్యాంక్లో తన మొత్తం వాటాను విక్రయించినట్లు వార్తలు వస్తున్నాయి. బ్లాక్ డీల్ ద్వారా రూ. 5000-7000 కోట్ల విలువైన యెస్ బ్యాంక్ షేర్లను విక్రయించినట్లు వార్తలు వస్తున్నాయి. యెస్ బ్యాంక్ షేర్ల విక్రయంపై SBIకి ఎలాంటి లాక్-ఇన్ పీరియడ్ లేదు. ఎస్బీఐ బోర్డ్ త్వరలో యెస్ బ్యాంక్లో షేర్ల విక్రయంపై చర్చిస్తుందని, తద్వారా వచ్చిన మొత్తాన్ని బ్యాలెన్స్ షీట్ లిక్విడిటీని పెంచడానికి ఉపయోగించాలని భావిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.
యెస్ బ్యాంక్ 23.55 కోట్ల షేర్ల భారీ బ్లాక్ డీల్ గురువారం జరిగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. మార్చి 2020లో ఎస్బీఐ నేతృత్వంలోని ఎనిమిది బ్యాంకులు యెస్ బ్యాంకులో వాటాలను కొనుగోలు చేశాయి. డిసెంబర్ 2023 నాటికి యెస్ బ్యాంక్లో ఎస్బీఐ వాటా 26.13 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 3%, ఐసీఐసీఐ బ్యాంక్ వాటా 2.61% ఈక్విటీని కలిగి ఉన్నాయి. మార్చి 2020లో ఆర్బీఐ యెస్ బ్యాంక్ని స్వాధీనం చేసుకుంది.

బ్యాంకు ఆర్థిక సమస్యల కారణంగా మొండి బకాయిలు, మూలధన సమీకరణలో సవాళ్లతో సహా మాజీ ఎస్బీఐ సీఎఫ్ఓ ప్రశాంత్ కుమార్ను అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. Q3 FY24లో, YES బ్యాంక్ రూ.231 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. యెస్ బ్యాంకులో నికర అడ్వాన్సులు 11.8% YY, 4.0% QoQ పెరిగి రూ.2.2 లక్షల కోట్లకు చేరాయి. రిటైల్, SME రుణాల వాటా 63%కి పెరిగింది.
ఈ త్రైమాసికంలో మొత్తం రూ.28,498 కోట్ల చెల్లింపులు, రిటైల్ ఆస్తులు రూ.9,769 కోట్లు, గ్రామీణ రుణాలు రూ.1,126 కోట్లు, ఎస్ఎంఈ రుణాలు రూ.8,265 కోట్లు, మధ్యతరహా కార్పొరేట్ రుణాలు రూ.1,108 కోట్లు ఉన్నాయి. యెస్ బ్యాంకులో ఎస్బీఐ తన వాటా విక్రయిస్తే యెస్ బ్యాంకు షేర్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications