Stock Market Close: రంకలేసిన బుల్.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

శుక్రవారం స్టాక్ మార్కెట్ లో బుల్ రంకలేసింది. మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1618 పాయింట్లు పెరిగి 76693 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 468 పాయింట్ల వృద్ధి చెంది 23290 వద్ద స్థిరపడింది. ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా ఉంచడంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ఐటీ స్టాక్ ల్లో ర్యాలీ కనిపించింది. విప్రో 5 శాతానికి పైగా పెరిగ్గా.. టెక్ మహీంద్రా 4, ఇన్ఫోసిస్ 3 శాతం పెరిగాయి.

బీఎస్ఈ ఇండెక్స్ లో ఎంఅండ్ఎం, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, భారతి ఎయిర్ టెల్, బజాబ్ ఫైనాన్స్, టాటా స్టీల్, అల్ట్రా టెక్ సిమెంట్, ఎన్టీపీసీ, టైటాన్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా, రిలయన్స్, హెచ్ సీఎల్ టెక్, ఎస్బీఐఎన్, టీసీఎస్, యాక్సెస్ బ్యాంక్, ఎల్అండ్ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, మారుతి, ఏసియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ లాభాల్లో ముగిశాయి.

The stock markets ended in huge gains with a huge rally in IT stocks

అన్ని రంగాల సూచీలు ఆటో, ఐటీ, పవర్, టెలికాం, మెటల్ 2-3 శాతం వృద్ధితో గ్రీన్‌లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.2 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2 శాతం పెరిగింది. నిఫ్టీ 50లో ఎస్బీఐ లైఫ్, టాటా కన్సూమర్ నష్టపోగా.. మిగతా స్టాక్ లన్నీ లాభాల్లో ముగిశాయి. ముత్తూట్ మైక్రోఫిన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో వ్యూహాత్మక సహ రుణ భాగస్వామ్యం కాబోతున్నట్లు తెలిపింది.

ఈ సహకారంతో ముత్తూట్ మైక్రోఫిన్ లిమిటెడ్ తన ఆర్థిక సేవలను భారతదేశంలోని గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని మహిళా పారిశ్రామికవేత్తలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మాస్టెక్ తన icxPro ప్లాట్‌ఫారమ్‌ను ఎన్విడియా యాక్సిలరేటెడ్ కంప్యూటింగ్‌తో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+