Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. రాణిస్తున్న ఎన్బీఎఫ్సీ స్టాక్లు
శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతోన్నాయి. ఉదయం 10 గంటల 4 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 203 పాయింట్లు పెరిగి 66,468 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 51 పాయింట్లు వృద్ధి చెంది 17,774 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్ టీ, పవర్ గ్రిడ్, టాటా మోటర్స్, హెచ్సీఎల్ టెక్, భారతి ఎయిర్ టెల్, మారుతీ, ఎస్బీఐఎన్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఏసియన్ పెయింట్స్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహింద్రా, హిందుస్థాన్ యూనిలివర్, హెచ్ డిఎఫ్సీ బ్యాంకు, నెస్లే ఇండియా లాభాల్లో కొనసాగుతోన్నాయి.
సన్ ఫార్మా, టీసీఎస్, జెఎస్ డబ్ల్యూ స్టీల్, కొటాక్ మహింద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎఫ్ఐఐ అమ్మకాలు ఉన్నప్పటికీ, బలమైన రిటైల్ కొనుగోళ్ల మద్దతుతో స్థిరమైన DII పెట్టుబడి మార్కెట్ను పెంచుతోంది. సెప్టెంబర్లో ఇప్పటివరకు ఎఫ్ఐఐలు రూ.8608 కోట్లకు విక్రయించగా, డీఐఐలు రూ.5715 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ నికర సంస్థాగత అమ్మకాలు ఉన్నప్పటికీ, నిఫ్టీ ఇప్పటివరకు నెలలో 434 పాయింట్లు పెరిగింది. ఇది మిడ్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లలోని హైపర్ యాక్టివిటీ, ర్యాలీలో రిటైల్ ఇన్వెస్టర్ల క్రియాశీల భాగస్వామ్యాన్ని సూచిస్తున్నాయి.

సెప్టెంబర్ 2, 2023 నుంచి అమలులోకి వచ్చేలా కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్ & CEO గా శ్రీ దీపక్ గుప్తా నియామకాన్ని రెండు నెలల కాలానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించింది.


Click it and Unblock the Notifications