Onion: ఉల్లి ఎగుమతిపై మార్చి 31 వరకు నిషేధం పొడగింపు..!

భారత ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఆర్థిక సంవత్సరం చివరి వరకు పొడిగించింది. దేశీయ లభ్యతను పెంచాలని, ధరలను అదుపులో ఉంచాలని కేంద్రం కోరుతున్నందున ఎగుమతి నిషేధం మార్చి 31, 2024 వరకు కొనసాగుతుందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మంగళవారం తెలిపారు.

గత అక్టోబర్ లో ఉల్లి ధర భారీగా పెరగడంతో అప్పట్లో కేంద్రం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో ధరలు దిగొచ్చాయి. 2023 అక్టోబర్‌లో, వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి రిటైల్ మార్కెట్‌లలో బఫర్ ఉల్లిపాయ స్టాక్‌ను కిలోకు రూ. 25 సబ్సిడీ రేటుతో విక్రయించారు.

The ban on onion export has been extended till March 31

కమోడిటీపై ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించిందన్న నివేదికల నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద హోల్‌సేల్ ఉల్లి మార్కెట్ అయిన లాసల్‌గాన్‌లో ఫిబ్రవరి 19న మోడల్ హోల్‌సేల్ ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.1,280 నుంచి 40.62 శాతం పెరిగి రూ.1,800కి చేరుకుంది. రాబోయే రెండు నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నందున, మార్చి 31 తర్వాత కూడా నిషేధాన్ని ఎత్తివేసే అవకాశం లేదు.

ఎందుకంటే విస్తీర్ణం తక్కువగా ఉన్నందున రబీ (శీతాకాలం) ఉల్లి ఉత్పత్తి తక్కువగా ఉంటుందని అంచనా వేశారు.,
2023 రబీ సీజన్‌లో ఉల్లి ఉత్పత్తి 22.7 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు రాబోయే రోజుల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో రబీ ఉల్లి కవరేజీని అంచనా వేస్తున్నారు.

ఉల్లి ఎగుమతి నిషేధించండంతో రైతులు నష్టపోతున్నారు. ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో రైతులు ఇబ్బంది పడుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+