కూతుర్ల మీద ప్రేమ..గుడ్డిగా నమ్మి రూ. 14 కోట్లు కోల్పోయిన తండ్రి.. కేసు ఏంటంటే..

తన కుమార్తెల అనారోగ్యాన్ని నయం చేయాలనే తపనలో ఒక టెక్కీ కుటుంబం జీవితకాల సంపాదన అంతా కోల్పోయింది. పూణేలో చోటుచేసుకున్న ఈ ఘోర మోసం కేసులో ఒక ఐటీ ఇంజనీర్, అతని భార్యను ఆధ్యాత్మిక వైద్యం పేరుతో మోసగించిన నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.పూణే సైబర్, ఆర్థిక నేరాల డీసీపీ వివేక్ మసల్ ప్రకారం, బాధిత దంపతులు 2018లో దర్బార్ సమావేశాలు నిర్వహించే ఒక మహిళా గురువును కలిశారు. ఆ మహిళ తాము దైవ శక్తుల ద్వారా రోగాలను నయం చేయగలమని చెప్పి, వారిలో విశ్వాసాన్ని పెంపొందించింది.

ఈ దంపతులలో Techie యాభై ఏళ్ల వయసులో ఉన్నాడు. అతను ఒకప్పుడు లండన్‌లో పనిచేసి 2010లో పూణేకు వచ్చి స్థిరపడ్డాడు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకరు వికలాంగురాలు.. మరొకరు తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ బాధ్యతలతో కలత చెందిన దంపతులు ఆ గురువును కలుసుకున్నారు. మీ ఇళ్ల మీద దోషం ఉంది, దానిని తొలగించాలంటే మీ ఆస్తులను అమ్మి ఆ డబ్బును నా మార్గదర్శకత్వంలో ఉపయోగించాలని నిందితురాలు వారిని నమ్మించింది. ఆ మహిళ ఆధ్యాత్మిక పూజలు, యజ్ఞాలు, విశిష్ట శక్తుల ద్వారా పిల్లలను నయం చేయగలనని చెప్పి వారిని పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకుంది.

techie loses 14 crore spiritual cure scam Bengaluru fraud case fake spiritual healers IT professional duped spiritual healing fraud Bengaluru techie news father loses money for daughters treatment faith fraud India cybercrime Bengaluru police investigation scam fake godmen scam Indian techie scam spiritual healing con emotional fraud cases India miracle cure fraud Indian crime news financial fraud India online fraud Bengaluru techie loses fortune 14

దీంతో ఆ ఐటీ ఇంజనీర్ తన జీవితంలో చేసిన పొదుపు మొత్తాన్ని ఆమెకు బదిలీ చేశాడు. లండన్‌లోని తన ఇల్లు, పూణేలోని ఫ్లాట్, కొంకణ్ ప్రాంతంలోని భూమి.. ఇలా అన్ని ఆస్తులు అమ్మేశారు. అంతేకాక ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని ఉపసంహరించుకొని, బంధువుల వద్ద అప్పులు కూడా తీసుకున్నాడు. ఈ విధంగా 2018 నుండి 2024 మధ్యకాలంలో సుమారు రూ. 14 కోట్లు ఆ మహిళా నిందితురాలి ఖాతాలకు బదిలీ అయ్యాయి.

అయితే పిల్లల ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. కాలక్రమంలో ఆ దంపతులు తమ పొదుపులు, ఆస్తులు అన్నీ కోల్పోయి, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. చివరికి న్యాయవాది సలహాతో నవంబర్ 3, 2025న పూణే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై డీసీపీ వివేక్ మసల్ మాట్లాడుతూ.. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ఫిర్యాదులో పేర్కొన్న అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నాం. నిందితురాలి పాత్ర, డబ్బు లావాదేవీలు, బ్యాంక్ ఖాతా మార్గాలు.. అన్నీ ట్రేస్ చేస్తున్నాం. దర్యాప్తు తర్వాత తగిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

పోలీసులు ప్రాథమికంగా సైబర్, ఆర్థిక నేరాల చట్టాల ప్రకారం కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటన మానవ బలహీనతను, ఆధ్యాత్మిక అంధ విశ్వాసం ఎంతటి మోసాలకు దారితీస్తుందో మరోసారి రుజువు చేసింది. ప్రస్తుతం బాధిత ఇంజనీర్ అప్పుల బారిన పడి, తన కుమార్తెల వైద్య చికిత్స కోసం మళ్లీ పోరాడుతున్నాడు. పోలీసులు నిందితురాలి ఆస్తులు, ఖాతాలు, సహచరుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ కేసు టెక్కీ సమాజంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఆధ్యాత్మిక వైద్యం పేరుతో జరుగుతున్న మోసాలకు నిరోధక చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+