రానున్న రోజుల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి కాలం కలిసి రానుంది. కోవిడ్-19 తరువాత వేలల్లో ఉద్యోగాల కోత విధించిన టెక్ కంపెనీలు ప్రస్తుతం రిక్రూట్మెంట్ల మీద పడ్డాయి. ఈ తరుణం మరో పెద్ద కంపెనీ బిటెక్ ఫైనల్ ఇయర్ వాళ్లకు గుడ్ న్యూస్ అందించింది. భారతదేశపు అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025 నాటికి కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ప్రెస్సర్లను తీసుకోనున్నట్లు TCS HR అధికారి మిలింద్ లక్కడ్ తెలిపారు. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య మరింత పెరగవచ్చని కూడా ఆయన చెప్పారు. అంతే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ జెనరేటివ్ AI వంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పని చేయడానికి ట్రైనింగ్ ఇవ్వాలని కూడా యోచిస్తోంది. టీసీఎస్ ప్రస్తుతం మంచి రాబడులు అందుకుంటున్న కంపెనీ. ఇప్పుడు కంపెనీ సీనియర్ ఉద్యోగులను రిక్రూట్ చేయడంపై ఫోకస్ చేస్తుంది. కీలకమైన వ్యాపార రంగాల్లో గ్రోత్ ట్రెండ్ కారణంగా TCS ఈ చర్య తీసుకుంటోంది.
అలాగే TCS వంటి భారతదేశంలోని ఇతర IT కంపెనీలు కూడా వృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ఇంకా 1 సంవత్సరానికి పైగా నిలిచిపోయిన ఆన్-క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థులను నియమించుకునే ప్రక్రియను తిరిగి ప్రారంభించాయి. దీని కోసం టీసీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులను కెరీర్ రెడీ చేసుకునేందుకు ట్రైనింగ్ కూడా అందించాలని ప్లాన్ చేసింది. TCS టెక్నాలజీ వెండర్స్ తో కలిసి పనిచేస్తుంది. విద్యార్థుల ఫైనల్ సెమిస్టర్లో ఉన్నప్పుడు ప్రత్యేక ట్రైనింగ్ అందించడానికి టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ల సహకారంతో ఒక కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా విద్యార్థులు త్వరగా ఉద్యోగావకాశాలు పొందవచ్చు.

ప్రస్తుతం, TCS కంపెనీ 5 డే వర్క్ పాలసీ పై పని చేస్తోంది. అటెండేన్స్ పాలసీ ఆధారంగా ఆఫీసుకి వచ్చే వాళ్ళకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు లెక్కిస్తారని చెబుతున్నారు. ఆఫీస్ క్లాచర్ బలోపేతం చేసేందుకు, ప్రతి ఒక్కరూ సహకారంతో పని చేసేలా ప్రోత్సహించడానికి TCS ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.
19 సంవత్సరాలలో మొదటిసారిగా TCS 2024 ఆర్థిక సంవత్సరంలో 19,249 మంది ఉద్యోగులను తగ్గించింది. ఉద్యోగుల టర్నోవర్ రేటు గత త్రైమాసికంలో 12.1 శాతం నుంచి 12.3 శాతానికి పెరిగింది. అయితే ఈ త్రైమాసికంలో అట్రిషన్ రేటు గత ఏడాది ఇదే త్రైమాసికంలో 14.9 శాతం కంటే తక్కువగా ఉంది. ఆర్థికంగా చూస్తే రెండో త్రైమాసికంలో TCS నెట్ ప్రాఫిస్ట్ రూ.11,999 కోట్లు. గతేడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో రెవెన్యూ 7.6 శాతం పెరిగి రూ. 64,559 కోట్లుగా ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications