TCS News: టెక్ ఉద్యోగులు చాలా కాలంగా తమ రంగంలోని ఉద్యోగ అవకాశాలు కొరవడటంపై ఆందోళన చెందుతున్నారు. పరిస్థితులు దాదాపు 2 రెండేళ్లుగా దిగజారుతూనే ఉన్నాయి. అది ప్రస్తుతం హైరింగ్ నిలిపివేతలకు దారితీసింది. దీనికి తోడు భారతీయ టెక్ కంపెనీలు ప్రస్తుతం ఏఐ వినియోగం దిశగా అడుగులువేస్తున్నాయి.
ఇలాంటి క్రమంలో దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ శుభవార్త చెప్పింది. గతవారం కంపెనీ ఫ్రెషర్ల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నియామకాలపై స్పష్టతను సీఈవో కృతివాసన్ ఇస్తూ.. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంటామని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10,000 మంది ఫ్రెషర్లను నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు.

కంపెనీ గతంలో క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసిన విద్యార్థులకు ఆఫర్ లెటర్లను అందించిన సంగతి తెలిసిందే. ఇవి పొందిన వారందరికీ తప్పకుండా ఉద్యోగాలు కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామని కృతివాసన్ ప్రకటించారు. కళాశాలల్లో ఎంపికైన ట్రైనీలు కంపెనీ అంతర్గతంగా నిర్వహించే 6-8 నెలల శిక్షణ తర్వాత వాస్తవ పనిలోనికి అడుగుపెడతారని చెప్పారు. నియామకాలు చేపట్టిన సమయానికి, ఎంపికైన విద్యార్థులు ప్రాజెక్టుల్లో చేరే సమయానికి మధ్య అంతరం ఉంటుంది. అందువల్ల సిబ్బంది సంఖ్య తగ్గడాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదని సీఈవో వెల్లడించారు.
మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ అట్రిషన్ రేటు గత త్రైమాసికంలో 13.3 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది. ఉద్యోగుల సంఖ్య 1759 తగ్గటంతో ప్రస్తుతం హెడ్ కౌంట్ 6,03,305గా ఉన్నట్లు కంపెనీ తన త్రైమాసిక ఫలితాల సమయంలో వెల్లడించింది.
తాజాగా సీఈవో కృతివాసన్ దాదాపు 6 లక్షల మంది టీసీఎస్ ఉద్యోగులకు మెయిల్ ద్వారా కీలకమైన విషయాలను వెల్లడించారు. ముందుగా నాలుగో త్రైమాసికంలో అత్యుత్తమ పనితీరు సాధించటానికి దోహదపడిన్న మెుత్తం ఉద్యోగులందరినీ ప్రశంశించారు. కంపెనీ రానున్న కాలంలో అవసరాలకు అనుగుణంగా ఏఐ సాంకేతికలపై పట్టు ఉండేలా ఉద్యోగులను తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గడచిన త్రైమాసికంలో చాలా మంది ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కంపెనీ దాదాపు 200 ఏఐ ప్రాజెక్టులపై పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications