Tax Deduction: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి దాదాపు 2 రోజులు మాత్రమే ఇంకా గడువు ఉంది. ఈ క్రమంలో ముందుగా వేతనజీవుల చూపు ఆదాయపు పన్ను రేట్ల తగ్గింపు నుంచి అదనపు ప్రయోజనాలపై ఆర్థిక మంత్రి చేసే ప్రకటనలపైనే కొనసాగుతోంది.
కొత్త పన్ను విధానం కింద ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గడచిన కొన్ని వార్షిక బడ్జెట్ ప్రసంగాల సమయంలో కొన్ని డిడక్షన్లు, మినహాయింపులను అందిస్తూ వచ్చారు. అలాగే పన్ను చెల్లింపుదారులకు న్యూ టాక్స్ రీజిమ్ కింద స్టాండర్డ్ డిడక్షమ్ మెుత్తాన్ని కూడా పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోడీ 3.0 ప్రభుత్వంలో అధిక ద్రవ్యోల్బణం, మారుతున్న వినియోగ ధోరణుల నేపథ్యంలో పన్ను రేట్లలో తగ్గింపులు, అధిక మినహాయింపు పరిమితుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న టాక్స్ పేయర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా ప్రజలపై భారం పెరుగుతోంది. ఈ క్రమంలో సంపాదనలు ఆ స్థాయిలో పెరగకపోవటం, ఖర్చు చేయటానికి తగిన ఆదాయం ఉండక పోవటం వంటి సమస్యలకు కొత్త పన్ను విధానం కింద ఉపశమనాలకు దారితీసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో రానున్న బడ్జెట్లో HRAను చేర్చడం, సెక్షన్ 80C పన్ను మినహాయింపుల పెంపుతో పాటు స్టాండర్ట్ డిడక్షన్ రూ.లక్ష వరకు పెంచాలని ఆర్థిక నిపుణులు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన వేళ ఈ చర్యలు ప్రజల కొనుగోళ్లను మెరుగుపరుస్తాయని వారు చెబుతున్నారు.
వాస్తవానికి మోదీ సర్కార్ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో 2020 వార్షిక బడ్జెట్లో కొత్త పన్ను విధానం ప్రవేశపెట్టబడింది. ఇది అంతకు ముందు ఉన్న పాత పన్ను విధానానికి ప్రత్యామ్నాయంగా తీసుకురాబడింది. చాలా మంది ఇప్పటికీ పాత పన్ను విధానాన్ని ఫాలో కావటానికి అసలు కారణం అందులో వివిధ సెక్షన్ల కింద లభిస్తున్న పన్ను రాయితీలేనని ఒప్పుకోవాల్సిన నిజం. ప్రస్తుతం రెండు పన్ను విధాల కింద స్టాండర్డ్ డిజక్షన్ అందించబడుతోంది. వేతన జీవులకు పాత పన్ను విధానం కింద ఇది రూ.50,000 వరకు ఉండగా.. కొత్త పన్ను విధానం కింద 2024 బడ్జెట్ ప్రసంగంలో పెంచిన తర్వాత రూ.75,000కు చేరుకుంది.
చాలా మంది పన్ను చెల్లింపుదారులు సహజంగా వినియోగించుకునేది సెక్షన్ 80సీ డిడక్షన్స్. పాత పన్ను విధానం కింద దీనికి రూ.1.50 లక్ల వరకు గరిష్ఠ మినహాయింపు లభిస్తుంది. ఇది పన్ను చెల్లింపుదారుల బాధ్యతను తగ్గించటంలో దోహదపడుతుంది. ఇదే క్రమంలో హోమ్ లోన్ కోసం చెల్లించే వడ్డీ విషయంలోనూ రూ.50,000 వరకు సెక్షన్ 80ఈఈ కింద మినహాయింపు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందటానికి అవకాశం కల్పిస్తోంది. తాజాగా అమెరిక అధ్యక్షుడు సైతం ప్రజలపై ఎలాంటి ఆదాయపు పన్ను విధించకూడదని భావిస్తున్నట్లు కామెంట్ చేయటం కూడా ప్రజలపై పెరుగుతున్న పన్నుల భారం ప్రభావాన్ని నిరూపిస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications