చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ వివోలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయాలని టాటా గ్రూప్ పరిశీలిస్తోందని వార్తలు వస్తున్నాయి. దీని కోసం టాటా గ్రూప్ వివోతో చర్చలు ప్రారంభించినట్లు కథనాలు వస్తున్నాయి. భారత ప్రభుత్వం చైనా కంపెనీలను స్థానిక కంపెనీలతో భాగస్వామ్యం చేయమని కోరుతున్న సంగతి తెలిసిందే. దీంతో తయారీ, పంపిణీతో సహా దాని కార్యకలాపాల కోసం వివో స్థానిక భాగస్వామి కోసం వెతుకుతోంది. ఇందులో భాగంగా టాటా గ్రూప్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
టాటా గ్రూప్, వివో మధ్య చర్చలు అధునాతన దశకు చేరుకున్నాయని, వాల్యుయేషన్కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని మనీకంట్రోల్ వర్గాలు తెలిపాయి. వివో వాటాను కొనుగోలు చేయడానికి టాటా ఆఫర్ చేస్తున్న దానికంటే ఎక్కువ విలువను డిమాండ్ చేస్తోంది. ఈ డీల్పై టాటా గ్రూప్ ఆసక్తి చూపుతున్నప్పటికీ ఇంకా ఫలితం రాలేదని మనీకంట్రోల్ వర్గాలు తెలిపాయి. టాటా సన్స్, వివో రెండూ ఈ అంశంపై మాట్లడడానికి నిరాకరించాయి. భారత ప్రభుత్వం నుంచి చాలా పరిశీలన తర్వాత, చైనీస్ మొబైల్ కంపెనీలు వివో, ఒప్పో రెండూ తమ స్థానిక తయారీ కోసం భారతీయ భాగస్వాముల కోసం చూస్తున్నాయి.

చైనీస్ మొబైల్ హ్యాండ్సెట్ కంపెనీతో జాయింట్ వెంచర్లో భారతీయ కంపెనీకి 51 శాతం వాటా ఉండాలని భారత ప్రభుత్వం కోరుకుంటోంది. అలాగే, జాయింట్ వెంచర్లో స్థానిక నాయకత్వంతో పాటు స్థానిక పంపిణీ కూడా ఉండాలి. ఇది చైనా హ్యాండ్సెట్ బ్రాండ్ల ఆధిపత్యంలో ఉన్న దేశ మొబైల్ ఫోన్ పరిశ్రమలో దేశీయ కంపెనీలతో పాటు భారతీయ ఎగ్జిక్యూటివ్ల ప్రభావాన్ని పెంచుతుంది. పన్నులను ఆదా చేసేందుకు వివో తన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని చైనా మాతృ సంస్థకు చెల్లించినందుకు ఏజెన్సీల విచారణ ఎదుర్కొంటోంది.
కంపెనీపై వచ్చిన మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు చేస్తోంది. అయితే ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో భారీ విస్తరణకు టాటా గ్రూప్ సిద్ధమవుతోంది. గత సంవత్సరం టాటా ఎలక్ట్రానిక్స్ దేశంలో ఐఫోన్ను తయారు చేసిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది. ఇది తైవాన్ విస్ట్రాన్ కార్యకలాపాలను $125 మిలియన్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు కంపెనీ తన చెన్నైకి చెందిన ఐఫోన్ తయారీ కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి Apple ఇతర కాంట్రాక్ట్ తయారీ కంపెనీ పెగాట్రాన్తో చర్చలు జరుపుతోంది. ఇది కాకుండా, టాటా ఎలక్ట్రానిక్స్ తమిళనాడులోని హోసూర్లో ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్ను నిర్మిస్తోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications