ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ లాక్ డౌన్ సమయంలో వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్విగ్గీ ఫుడ్ను డెలివరీ చేసే యాప్. లాక్ డౌన్ నేపథ్యంలో హోటల్స్, రెస్టారెంట్లు మూతబడ్డాయి. దీంతో ఈ ఆర్డర్స్ లేవు. ఇప్పటి వరకు ఆర్డర్స్ తీసుకోవడం మానేసింది. తాజాగా మరో రకంగా ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించింది. ఈ ఆర్డర్లు ఫుడ్ కోసం కాదు... నిత్యవాసర వస్తువుల కోసం.

లాక్ డౌన్ సమయంలో ఇంటికే నిత్యావసరాలు
కరోనా విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. మొదట 21 రోజులు.. తాజాగా ప్రధాని మోడీ దీనిని మే 3వ తేదీ వరకు పొడిగించారు. ఏప్రిల్ 20వ తేదీ నుండి కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో కాస్త సడలింపు ఉంటుంది. నిత్యావసర సరుకుల కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటికి ఒక్కరు మాత్రమే బయటకు రావాలి. బయటకు వెళ్లలేని వారి కోసం స్విగ్గీ కొత్తగా నిత్యావసర సరుకులు ఇంటికే డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.

గ్రాసరీ సెక్షన్.. నో కాంటాక్ట్ డెలివరీ
దేశంలోని 125 పట్టణాల్లో నిత్యావసరాలను ఇంటికి డెలివరీ చేయనున్నట్లు స్విగ్గీ ప్రకటించింది. కస్టమర్లకు సమీపంలోని దుకాణాల నుండి వారికి కావాల్సిన సరుకులు డెలివరీ చేస్తుంది. ఇందుకు యాప్లో గ్రాసరీ సెక్షన్ను జోడించింది. దీనిపై క్లిక్ చేస్తే మనకు నచ్చిన స్టోర్ నుండి కావాల్సిన సరుకులను 'నో కాంటాక్ట్' డెలివరీ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని నగరాలకు..
రాబోవు కొద్దివారాల్లో సెలక్ట్ చేసిన 125 నగరాల్లో మరిన్ని స్టోర్స్ను చేరుస్తామని, స్థానిక అధికారులు అనుమతించిన చోట మరిన్ని నగరాలకు విస్తరిస్తామని స్విగ్గీ తెలిపింది. బ్రాండ్స్, రిటైలర్లతో ప్రత్యక్ష భాగస్వామ్యం కస్టమర్లకు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపింది. ఆర్డర్స్ కోసం ధరలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపింది. అలాగే, స్విగ్గీ జీనీ సేవలు 15 నగరాల్లో ఉన్నాయి. దీని ద్వారా మెడిసిన్స్ అందిస్తోంది.

వివిధ బ్రాండ్స్తో స్విగ్గీ ఒప్పందం
నిత్యావసర వస్తువుల హోమ్ డెలివరీకి స్విగ్గీ వివిధ బ్రాండ్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. హిందూస్తాన్ యూనీలీవర్, పీ అండ్ జీ, గోద్రేజ్, డాబుర్, విశాల్ మెగా మార్ట్, అదానీ విల్మర్స్, సిప్లాలతో ఆయా నగరాల్లో జత కట్టింది. అందుబాటులోని స్టోర్స్ నుండి సరుకులు ఇంటికి డెలివరీ చేస్తుంది.

ఎప్పటి నుండో ఆలోచన
నిత్యావసరాలను స్విగ్గీలో చేర్చాలని తాము ఎప్పటి నుండో భావిస్తున్నామని, తమ కస్టమర్లకు అధిక ప్రయోజనాలు కల్పించాలని భావించామని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఉపయోగపడుతుందని స్విగ్గీ సీవోవో సుందర్ వివోక్ అన్నారు. దీనిని ఇలాగే కొనసాగిస్తామని, లాక్ డౌన్ సమయంలో ప్రజలకు కనీస మద్దతు ఇవ్వడమే తమ ఉద్దేశ్యమన్నారు.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications