డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్లు చెల్లవని అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు కొత్త ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటివరకు ప్రపంచ దేశాలతో పాటుగా పలు కంపెనీలు చెల్లించిన సుంకాల మాటేంటీ? దీనిపై కోర్టు కూడా తన తీర్పులో ఏమి స్పష్టం చేయలేదు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
సుంకాలు (Trump Traiffs) పేరుతో గతేడాది నుంచి అమెరికా వసూలుచేసిన సొమ్మును తిరిగిచ్చేస్తారా? తిరిగిచ్చేస్తే భారత ఎగుమతిదారులకు రీఫండ్ ఏమైనా వస్తుందా? ఈ తీర్పుతో భారతీయ కంపెనీలకు (Indian Exporters) ఊరట లభించనుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
భారత్ సహా ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు చెల్లవని ప్రకటించిన తీర్పు వెలువడిన తర్వాత, ఇప్పుడు అందరి దృష్టి రీఫండ్లపై నిలిచి ఉంది. ఫిబ్రవరి 20న వచ్చిన ఈ 6-3 తీర్పు, అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద తీసుకున్న ట్రంప్ నిర్ణయాలను రద్దు చేసింది.
కానీ ఈ తీర్పు టారిఫ్లకు ఇప్పటికే చెల్లించిన సొమ్ము ఎలా తిరిగి పొందుతుందో స్పష్టంగా చెప్పలేదు. గతేడాది ఏప్రిల్ 2 నుంచి డిసెంబర్ మధ్య వరకు అమెరికా ఖజానాకు సుమారు 13,300 కోట్ల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు) చేరాయి.

అయితే, మార్కెట్ నిపుణుల సూచన ప్రకారం.. ఈ మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం సరళం కాదు. అమెరికాలో టారిఫ్ చెల్లించినవారు దిగుమతిదారులు కాబట్టి, రీఫండ్ మొదట వారి ఖాతాల్లోకి వెళ్తుంది. భారత ఎగుమతిదారులు (Indian Exporters) నేరుగా లబ్ధి పొందరు. అయితే ఈ తీర్పుతో భారతీయ కంపెనీలకు తిరిగి అమెరికా మార్కెట్లో ఉత్పత్తులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. కొంతమేర, అమెరికాలో తమ ఉత్పత్తులను మళ్ళీ సరఫరా చేసే అవకాశం.. ధరల తగ్గింపు ద్వారా నష్టాలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది.
రీఫండ్ ప్రక్రియ కూడా అంత సులభం కాదు. ప్రస్తుతం అమెరికా వద్ద టారిఫ్ రీఫండ్లకు ప్రత్యేక ఆటోమేటిక్ వ్యవస్థ లేదు. కంపెనీలు దరఖాస్తులు చేసుకుని, కోర్టులు ఆమోదిస్తే, US Customs & Border Protection (CBP) వాటిని సమీక్షించి చెల్లింపులు ప్రారంభిస్తుంది. నిపుణుల అంచనా ప్రకారం, ఇది 12 నుంచి18 నెలల వరకు సమయం పడవచ్చు. ట్రంప్ తానే గతంలో విలేకరులతో మాట్లాడుతూ రీఫండ్ వ్యాజ్యాలన్నీ పూర్తయ్యేవరకు రెండేళ్లు పడవచ్చని పేర్కొన్నారు.
ఇలాంటి పరిణామాలు గణనీయమైనవి. గతంలో కూడా 1990ల్లో హార్బర్ మెయింటెనెన్స్ ఫీజులు రాజ్యాంగవిరుద్ధమని కోర్టులు తీర్పు ఇచ్చి... రీఫండ్ల కోసం యూఎస్ కస్టమ్స్ ఒక ప్రత్యేక వ్యవస్థ రూపొందించారు. అయితే, ఇప్పటి పరిస్థితుల్లో, ఒకేసారి అంత పెద్ద మొత్తంలో రీఫండ్ చేయబడటం లేదు. కాబట్టి, భారతీయ ఎగుమతిదారులు ధైర్యంగా ఉండి, అమెరికా మార్కెట్ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే కాస్ట్కో, రెవ్లాన్, బంబుల్ బీ ఫుడ్స్ వంటి కొన్ని కంపెనీలు దిగువ కోర్టుల వద్ద రీఫండ్ కోసం పిటిషన్లు దాఖలు చేసాయి. వీటి ఫలితాలపై మిగిలిన కంపెనీలు కూడా అనుసరించే అవకాశం ఉంది.
ఏదేమైనా సుప్రీంకోర్టు తీర్పు ట్రంప్ సుంకాలను రద్దు చేసినప్పటికీ, రీఫండ్ పొందడం సులభం కాదు. అయినప్పటికీ, అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తులకి తిరిగి గిరాకీ పెరగడం, నష్టాన్ని కొంతమేర తగ్గించడం, భవిష్యత్తులో వాణిజ్య చర్చలకు దోహదం చేయడం వంటి ప్రయోజనాలు ఉండవచ్చు.
More From GoodReturns

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications