Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
చైనాలో కోవిడ్ కేసుల పెరుగుదల కారణంగా వరుసగా మూడవ రోజు స్టాక్ మార్కట్లు నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 518.64 పాయింట్లు నష్టపోయి 61,144.84 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇండెక్స్ 147 పాయింట్లు క్షీణించి 18,159 వద్ద స్థిరపడింది. చైనాలో కోవిడ్ కేసులు పెరగడంతో ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపాయి.
కోవిడ్ ఇన్ఫెక్షన్లు
చైనాలో కోవిడ్ ఇన్ఫెక్షన్లు, మరణాల ప్రభుత్వానికి సవాలుగా ఉన్నాయని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్లోని వెల్త్ మేనేజ్మెంట్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ స్టీవ్ బ్రైస్ బ్లూమ్బెర్గ్తో చెప్పారు. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలు మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో భారతి ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, పవరి గ్రిడ్, టైటాన్, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి.
ఏసియన్ పెయింట్స్
ఏసియన్ పెయింట్స్, హెచ్ సీఎల్ టెక్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, ఎల్&టీ, ఎం&ఎం, ఎస్బీఐ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్ డిఎఫ్ సీ బ్యాంక్, ఐటీసీ, డా. రెడ్డీస్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, విప్రో, బజాజ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్ డీ ఎఫ్ సీ, రిలయన్స్ నష్టాల్లో ముగిశాయి.
మిడ్ క్యాప్ ఇండెక్స్
మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.15 శాతం నష్టపోయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.08 శాతం లాభపడింది. బ్యాంక్ నిప్టీ ఇండెక్స్ 0.2 శాతం నష్టపోయింది.