శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 303 పాయింట్లు పెరిగి 69,825 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 20,969 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో హెచ్ సీఎల్ టెక్, జెఎస్ డబ్లూ స్టీల్, ఇన్ఫోసిస్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, విప్రో, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, టైటాన్, కొటాక్ మహీంద్రా బ్యాంకు, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్అండ్ టీ, భారతీ ఎయిర్ టెల్, ఎస్బీఐఎన్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ లాభాల్లో ముగిసింది.
రిలయన్స్, సన్ ఫార్మా, మారుతీ, టాటా స్టీల్, ఏసియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్, టాటా మోటర్స్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, ఐటీసీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీలో హెచ్సిఎల్ టెక్నాలజీస్, జెఎస్డబ్ల్యు స్టీల్, ఎల్టిఐఎండ్ట్రీ, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్గా ఉండగా, అదానీ ఎంటర్ప్రైజెస్, ఐటిసి, అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ప్, బ్రిటానియా ఇండస్ట్రీస్ నష్టపోయాయి.

సెక్టోరల్ ఫ్రంట్లో, ఎఫ్ఎంసిజి, ఆయిల్ & గ్యాస్, పవర్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం, హెల్త్కేర్, ఆటో 0.5 శాతం చొప్పున క్షీణించాయి. మరోవైపు, బ్యాంక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్టీ 0.5-1 శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా దిగువన ముగియగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పడిపోయింది. శుక్రవారం భారత రూపాయి స్థిరంగా ఉంది. అదానీ గ్రూప్ స్టాక్స్ డిసెంబరు 8న పెరుగుదల కనిపించింది.
అదానీ ఎంటర్ప్రైజెస్ ఒక్కొక్కటి రూ. 2,833.6 వద్ద ఉంది. ఇది మునుపటి సెషన్ ముగింపు ధరతో పోలిస్తే 1.83 శాతం తక్కువ. హిండెన్బర్గ్ నివేదిక వ్యాప్తి తర్వాత దాని 52 వారాల కనిష్ట స్థాయి రూ. 1,017.45 నుండి, కౌంటర్ 278 శాతం పెరిగింది. గ్రూప్ స్టాక్స్లో, NDTV 12 pm నాటికి 5.55 శాతం నష్టాలను చవిచూసింది. అయితే, 52 వారాల కనిష్టం నుండి, షేర్లు ఒక్కొక్కటి 61.5 శాతం పెరిగాయి.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications