Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. రాణించిన ఐటీ స్టాక్స్..
వారంతంలో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో కదలాడిన సూచిలు సాయంత్రానికి లాభాల్లోకి వెళ్లాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 303 పాయింట్లు పెరిగి 60,261 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 17,956 పాయింట్ల వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్-30లో టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమ్ంట్, హిందూస్తాన్ యూనిలివర్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, ఎన్టీపీసీ, మారుతి, భారతి ఎయిర్ టెల్, ఎస్బీఐఎన్, ఎం&ఎం, హెచ్ సిఎల్ టెక్, హెచ్ డీఎఫ్ సీ, బజాబ్ ఫిన్ సర్వ్, పవర్ గ్రిడ్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, టెక్ మహీంద్రా లాభాల్లో ముగిశాయి.
టాటా మోటర్స్, సన్ ఫార్మా, రిలయన్స్, ఐటీసీ, ఏసియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్&టీ, నెస్లే ఇండియా, టైటాన్ నష్టాల్లో స్థిరపడ్డాయి. మెటల్, పవర్, పిఎస్యు బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరగడంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్లో ముగిశాయి. బిఎస్ఇ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి.