Stock Market Close: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

మంగళవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 220 పాయింట్లు కోల్పోయి 75170 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 22888 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో ఏసియన్ పెయింట్స్, విప్రో, జేఎస్ డబ్ల్యూ స్టీల్, హిందుస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎంఅండ్ఎం, హెచ్ సీఎల్ టెక్, ఎల్అండ్ టీ, టైటాన్, సన్ ఫార్మా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి.

నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐఎన్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ, మారుతి, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, భారతి ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ నష్టాల్లో ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీలో ఏసియన్ పెయింట్స్, ఎస్బీఐ లైప్, దివిస్ ల్యాబ్స్, గ్రాసియం, హెచ్డీ ఎఫ్సీ లైఫ్, హీరో మోటో కార్ప్, డా రెడ్డీస్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, హెచ్ సీఎల్ టెక్, ఎల్అండ్ టీ లాభాల్లో ముగిశాయి.

Stock markets ended in losses on Tuesday

సెక్టోరల్‌లో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, టెలికాం, పీఎస్‌యూ బ్యాంక్‌, పవర్‌ అండ్‌ రియాల్టీ 1-2 శాతం క్షీణించాయి. ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్ రంగాలు లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతం క్షీణించాయి. సోమవారం నాటి ముగింపు 83.13 వద్ద భారత రూపాయి మంగళవారం డాలర్‌తో పోలిస్తే 83.18 వద్ద ముగిసింది.

స్టేషనరీ కంపెనీ జనవరి-మార్చి త్రైమాసికం (Q4FY24) పనితీరును ఉల్లాసంగా నివేదించిన తర్వాత మే 28న DOMS ఇండస్ట్రీస్ షేర్లు 10 శాతానికి పైగా పెరిగాయి. మే 28న ఒక్కో షేరుకు రూ. 2,035 వద్ద ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+